Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఇంద్ర' రీ రిలీజ్‌లోనూ రికార్డులు - ఈ రెండు చిత్రాలకు సీక్వెల్స్!

ఠాగూర్
మంగళవారం, 27 ఆగస్టు 2024 (10:41 IST)
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా "ఇంద్ర" సినిమాను రీరిలీజ్​ చేశారు. ఈ చిత్రం రీ రిలీజ్​లోనూ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను అందుకుంటోంది. ఈ సందర్భంగా 'ఇంద్ర' చిత్ర బృందాన్ని తన ఇంటికి పిలిచి మెగాస్టార్​ చిరంజీవి సన్మానించారు. ఈ వేడుకలో నిర్మాత అశ్వినీ దత్​, దర్శకుడు బి.గోపాల్​తో పాటు రచయితలు పరుచూరి బ్రదర్స్, సంగీత దర్శకుడు మణిశర్మ, కథా రచయిత చిన్ని కృష్ణలు పాల్గొన్నారు. వీరందరికీ చిరు శాలువాలను కప్పి సన్మానించారు. అలానే అశ్వినీ దత్​కు ప్రత్యేకంగా పాంచజన్యాన్ని బహుమతిగా ఇచ్చారు. 
 
వైజయంతీ మూవీస్ బ్యానర్ లోగోపై సీనియర్​ ఎన్టీఆర్ కృష్ణుడి వేషధారణలో ఈ పాంచజన్యాన్ని పూరిస్తూ కనిపిస్తారు. అందుకే ఈ పాంచజన్యాన్ని బహుమతిగా ఇచ్చానని చిరంజీవి చెప్పారు. ఇక ఈ సన్మాన కార్యక్రమం పుర్తైన తర్వాత  అశ్వినీ దత్ 'ఇంద్ర', 'జగదేకవీరుడు అతిలోకసుందరి' సినిమాలకు సీక్వెల్స్ తీసుకొచ్చేందుకు తాను ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ రెండు సీక్వెల్స్ కోసం అభిమానులు ఎంతోకాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని, వీటికి సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా గాంధీ రూ.142 కోట్లు సంపాదించారా?

కదులుతున్న రైలు నుంచి సూట్‌కేస్ విసిరేసారు, తెరిచి చూస్తే శవం

Jagan: చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎందుకు? వైఎస్ జగన్ అరెస్ట్ కోసమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments