మరోసారి జత కట్టనున్న అర్జున్ రెడ్డి.. ప్రీతి?

Webdunia
శుక్రవారం, 8 మార్చి 2019 (11:37 IST)
విజయ్ దేవరకొండ కెరీర్‌లో అత్యంత పెద్ద స్థాయిలో నిల్చిపోయి... అతనిని సడన్ స్టార్‌గా చేసేస్తూ తెలుగు తెరపై కొత్త ముద్ర వేసిన సినిమా ''అర్జున్‌ రెడ్డి''. నటీనటుల ప్రతిభ, సాంకేతిక నైపుణ్యం ఈ చిత్రానికి మర్చిపోలేని విజయాన్ని అందించాయి. 
 
ఇందులో తెరపై ఎక్కడా అర్జున్‌, ప్రీతి పాత్రలు తప్ప విజయ్‌ దేవరకొండ, షాలినీ పాండేలు కనిపించలేదంటే అతిశయోక్తి కాదేమో... వీరిద్దరి మధ్య గాఢమైన అనుబంధాన్ని ఆవిష్కరించిన విధానం యువ ప్రేక్షకులను కట్టి పడేసింది.

ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలసి నటించబోతున్నారని  తెలుస్తోంది. విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా మైత్రీ మూవీస్‌ ఓ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. 
 
ఆనంద్‌ అన్నామలై దర్శకుడిగా పరిచయం అవుతుండగా ఇందులో కథానాయిక పాత్ర కోసం షాలినీ పాండేని తీసుకున్నట్లు సమాచారం. క్రీడా నేపథ్యంలో సాగే కథ ఇది. విజయ్‌ ఓ రేసర్‌ పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది. ఈసారి ఈ జంట మరేం చేస్తారో చూద్దాం మరి..!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bhuvaneswari: నారా లోకేష్‌ను అభినందించిన భువనేశ్వరి.. ప్రభుత్వ విద్య అదుర్స్

రెండు రోజుల్లో పెళ్లి.. ఫైనాన్షియర్ల వేధింపులు తాళలేక వ్యక్తి ఆత్మహత్య

స్కూలుకు లేటు.. వీపు మీద బ్యాగ్‌తోనే 100 గుంజీలు.. బాలిక మృతి.. ఎక్కడ?

యేడాదిగా టీచర్లు హేళన చేస్తున్నారు... సారీ మమ్మీ... నా అవయవాలను దానం చేయండి...

Rythanna Meekosam: నవంబర్ 24 నుండి 29 వరకు రైతన్న మీకోసం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments