Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అర‌వింద స‌మేత' టీమ్‌ని టెన్ష‌న్ పెడుతున్న విజ‌య్ దేవరకొండ

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ చిత్రం అర‌వింద స‌మేత‌. వీర‌ రాఘ‌వ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాని ద‌స‌రా కానుక‌గా రిలీజ్ చేయాల‌నుకున్నారు. అయితే.. స‌డ‌న్‌గా హ‌రికృష్ణ చ‌నిపోవ‌డంతో షూటింగ్‌కి బ్రేక్

Webdunia
మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (14:49 IST)
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ చిత్రం అర‌వింద స‌మేత‌. వీర‌ రాఘ‌వ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాని ద‌స‌రా కానుక‌గా రిలీజ్ చేయాల‌నుకున్నారు. అయితే.. స‌డ‌న్‌గా హ‌రికృష్ణ చ‌నిపోవ‌డంతో షూటింగ్‌కి బ్రేక్ ప‌డింది. దీంతో అర‌వింద స‌మేత ద‌స‌రాకి రావ‌డం క‌ష్ట‌మే అంటూ ప్ర‌చారం మొద‌లైంది. కానీ.. ఎన్టీఆర్ షూటింగ్‌లో జాయిన్ అవ్వ‌డంతో ఇక ద‌స‌రాకి రావ‌డం ఖాయం అని తెలుస్తుంది. 
 
ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... గీత గోవిందం సినిమాతో బ్లాక్‌బ‌ష్ట‌ర్ సొంతం చేసుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ తాజాగా న‌టిస్తోన్న చిత్రం నోటా. తెలుగు, త‌మిళ్‌లో రూపొందుతోన్న ఈ చిత్రానికి ఆనంద్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న మెహ్రీన్, సంచ‌న న‌ట‌రాజ‌న్ న‌టిస్తున్నారు. ఈ సినిమాని స్టూడియో గ్రీన్ బ్యాన‌ర్ పైన జ్ఞాన‌వేల్ రాజా నిర్మిస్తున్నారు. 
 
పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 4న రిలీజ్ చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా నోటా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను ఈ నెల 6న సాయంత్రం 4 గంట‌ల‌కు రిలీజ్ చేయ‌నున్న‌ట్టు విజ‌య్ దేవ‌ర‌కొండ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు. దీంతో అక్టోబ‌రులో పోటీ లేకుండా వ‌స్తున్నాం అనుకున్న అర‌వింద టీమ్ ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌స్తుండ‌టం... ఆ త‌ర్వాత రామ్ సినిమా వ‌స్తుండ‌టం.. అలాగే విశాల్ పందెం కోడి 2 కూడా వ‌స్తుండ‌టంతో టెన్ష‌న్ ప‌డుతున్నార‌ట‌. అదీ సంగ‌తి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి షాకిచ్చిన కోర్టు

జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments