Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆహాలో ఆకట్టుకుంటోన్న జోజు జార్జ్ చిత్రం ఆంటోని

డీవీ
శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024 (16:42 IST)
Antony - Joju George
మలయాళంలో మంచి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ వస్తుంటాయన్న సంగతి తెలిసిందే. ఇక ఈ మధ్య జోజు జార్జ్ సినిమాలకు డిమాండ్ ఎక్కువగా పెరిగింది. గత ఏడాది వచ్చిన ‘ఆంటోని’ చిత్రంలో జోజు జార్జ్, కళ్యాణీ  ప్రియదర్శన్ నటన గురించి సోషల్ మీడియాలో బాగానే చర్చలు జరిగాయి. ఇక ఈ సినిమా మాలీవుడ్‌లో మంచి విజయాన్ని అందుకుంది. దీంతో తెలుగు ఆడియెన్స్ ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఎదురుచూశారు.
 
ఫిబ్రవరి 23న ఆంటోని సినిమా ఆహాలోకి వచ్చింది. ఇక తెలుగు ఆడియెన్స్ ఆహాలో ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌ను చూసి ఆనందించొచ్చు. ఈ చిత్రం గత ఏడాది అంటే..  డిసెంబర్ 1, 2023న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మంచి రివ్యూలతో పాటు, కలెక్షన్లు కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు తెలుగులో ఓటీటీ ఆడియెన్స్‌ను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
 
ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ మీద ఆంటోని చిత్రం సాగుతుంది. ఈ మూవీలో టైటిల్ రోల్‌లో జోజు జార్జ్ నటించారు. రాజేష్ వర్మ అందించిన కథతో జోషి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో  కల్యాణి ప్రియదర్శన్, చెంబన్ వినోద్ జోస్, నైలా ఉష, ఆశా శరత్, అప్పని శరత్, విజయరాఘవన్ వంటి వారు నటించారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతమందించగా.. సినిమాటోగ్రఫర్‌గా రెనాదివ్, ఎడిటర్‌గా శ్యామ్ శశిధరన్ పని చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హోటల్ గదిలో శృంగారంలో మునిగిన జంట: బ్రిడ్జి పైనుంచి వీడియో రికార్డింగ్, ట్రాఫిక్ జామ్

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments