Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్‌ని ఏపీ ప్రజలు కూడా ఆదరిస్తారు... పీపుల్ స్టార్ వ్యాఖ్య

Webdunia
శుక్రవారం, 14 డిశెంబరు 2018 (14:51 IST)
తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘ‌న విజ‌యం సాధించ‌డం.. కేసీఆర్ రెండోసారి సీఎం అవ్వ‌డం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ పైన సినీ ప్ర‌ముఖులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన రోజు సాయంత్రం సూప‌ర్ స్టార్ కృష్ణ కేసీఆర్‌ని అభినందిస్తూ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ అయితే.. ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ.. కేసీఆర్‌ని అభినందించింది. సినీ ప్ర‌ముఖులు కొంతమంది ప‌ర్స‌న‌ల్‌గా మ‌రి కొంతమంది సోష‌ల్ మీడియా వేదిక‌గా చేసుకుని కేసీఆర్‌ని అభినందిస్తున్నారు. 
 
పీపుల్ స్టార్ ఆర్.నారాయ‌ణ మూర్తి ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ని కలిశారు. కేసీఆర్‌కు అభినందనలు తెలిపిన అనంతరం నారాయణమూర్తి మీడియాతో మాట్లాడుతూ... నాలుగున్నరేళ్ల పాలన చూసి టీఆర్ఎస్‌ను 88 స్థానాల్లో ప్రజలు గెలిపించారని, ఉద్యమం తర్వాత కూడా తెలంగాణలో కేసీఆర్ వేవ్ నడుస్తోందని అన్నారు. ప్రజలకు అమోఘమైన పాలన అందించాలని కేసీఆర్‌ని కోరానని, భారత రాజకీయాల్లో కూడా ఆయన సేవల అవసరం ఉందని.. కేసీఆర్‌ను ఏపీ ప్రజలు కూడా ఆదరిస్తార‌న్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments