Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్‌ని ఏపీ ప్రజలు కూడా ఆదరిస్తారు... పీపుల్ స్టార్ వ్యాఖ్య

Webdunia
శుక్రవారం, 14 డిశెంబరు 2018 (14:51 IST)
తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘ‌న విజ‌యం సాధించ‌డం.. కేసీఆర్ రెండోసారి సీఎం అవ్వ‌డం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ పైన సినీ ప్ర‌ముఖులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన రోజు సాయంత్రం సూప‌ర్ స్టార్ కృష్ణ కేసీఆర్‌ని అభినందిస్తూ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ అయితే.. ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ.. కేసీఆర్‌ని అభినందించింది. సినీ ప్ర‌ముఖులు కొంతమంది ప‌ర్స‌న‌ల్‌గా మ‌రి కొంతమంది సోష‌ల్ మీడియా వేదిక‌గా చేసుకుని కేసీఆర్‌ని అభినందిస్తున్నారు. 
 
పీపుల్ స్టార్ ఆర్.నారాయ‌ణ మూర్తి ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ని కలిశారు. కేసీఆర్‌కు అభినందనలు తెలిపిన అనంతరం నారాయణమూర్తి మీడియాతో మాట్లాడుతూ... నాలుగున్నరేళ్ల పాలన చూసి టీఆర్ఎస్‌ను 88 స్థానాల్లో ప్రజలు గెలిపించారని, ఉద్యమం తర్వాత కూడా తెలంగాణలో కేసీఆర్ వేవ్ నడుస్తోందని అన్నారు. ప్రజలకు అమోఘమైన పాలన అందించాలని కేసీఆర్‌ని కోరానని, భారత రాజకీయాల్లో కూడా ఆయన సేవల అవసరం ఉందని.. కేసీఆర్‌ను ఏపీ ప్రజలు కూడా ఆదరిస్తార‌న్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments