Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుమ ఛాలెంజ్ స్వీక‌రించిన మంచు ల‌క్ష్మీ.. జూనియర్ ఎన్టీఆర్‌కు..

Webdunia
గురువారం, 28 నవంబరు 2019 (17:02 IST)
రాజ్య‌స‌భ సభ్యులు సంతోష్ కుమార్ చేప‌ట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. ప్రముఖ రాజ‌కీయ నాయ‌కులు, సెల‌బ్రిటీలు, క్రీడా ప్ర‌ముఖులు ఇందులో భాగం అవుతున్నారు. న‌వంబర్ 13న ప్ర‌ముఖ యాంక‌ర్ సుమ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీక‌రించి మూడు మొక్క‌లు నాటారు. 
 
అనంతరం జూనియర్‌ ఎన్టీఆర్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌, మంచు లక్ష్మీ, యాంకర్‌ ఓంకార్‌కు గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ విసిరారు. సుమ ఛాలెంజ్‌ని స్వీక‌రించిన మంచువార‌మ్మాయి త‌న ఇంట్లో మొక్క నాటారు. పర్యావరణాన్ని కాపాడే ఇలాంటి బృహత్తర కార్యక్రమంలో భాగం అయినందుకు సంతోషంగా ఉంద‌ని మంచు ల‌క్ష్మీ ఈ సంద‌ర్బంగా పేర్కొన్నారు. 
 
గ్రీన్ ఛాలెంజ్ చాలా ముఖ్య‌మైన‌ది.ఎన్ని చెట్లు నాటితే అంత మంచిది. ఇది నిరంత‌రాయంగా కొన‌సాగాలి. గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా.. మంచు మ‌నోజ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, నంద‌మూరి బాల‌కృష్ణ‌ల‌కి తాను ఛాలెంజ్ విసురుతున్న‌ట్టు తెలిపింది మంచు ల‌క్ష్మీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments