Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేసిన సాయం చెప్పుకోవడం ఇబ్బందిగా ఉంటుంది... అమితాబ్

Webdunia
బుధవారం, 12 మే 2021 (12:12 IST)
దేశ ప్రజలంతా కష్టాల్లో ఉన్నప్పటికీ వారిని ఆదుకునేందుకు సినీ సెలెబ్రిటీలు ఏమాత్రం ముందుకు రావడం లేదనే విమర్శలు ఉన్నాయి. వీటిపై బిగ్ బీ అమితాబ్ బచ్చన్ స్పందించారు. 
 
ఢిల్లీలోని కొవిడ్ సెంటర్‌కు తాను 2 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు చర్చ జరిగిందన్న అమితాబ్.. చేసిన సాయాన్ని చెప్పుకోవడం తనకు ఇబ్బందిగా ఉంటుందన్నారు. అయినా విమర్శల నేపథ్యంలో చెప్పక తప్పడం లేదన్నారు. కరోనా బాధితుల సహాయార్థం తాను ఇప్పటివరకు చేసిన సాయం మొత్తం విలువ రూ.15 కోట్ల వరకు ఉంటుందని వివరించారు. 
 
ఇప్పటివరకు తానేం చేసినదీ కూడా అమితాబ్ చెప్పుకొచ్చారు. ముంబై జుహూలో 25-50 పడకల కొవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటుకు నిధులు ఇచ్చానని, ఫ్రంట్లైన్ వర్కర్లకు పీపీఈ కిట్లు, మాస్కులు అందజేశానని వివరించారు. ముంబై ఆసుపత్రికి ఎంఆర్ఐ యంత్రం, సోనో గ్రాఫిక్, స్కానింగ్ పరికరాలను సమకూర్చినట్టు చెప్పారు. 
 
ఎంతోమంది పేద రైతులను ఆదుకున్నానని, ఇంత పెద్ద సాయం తనకు కష్టమైనా సరే ఆనందంగా చేశానని అమితాబ్ వివరించారు. అలాగే, 20 వెంటిలేటర్ల కోసం విదేశీ కంపెనీలకు ఆర్డర్ ఇచ్చానని, వాటిలో ఇప్పటికే పది అందుబాటులోకి వచ్చాయని అమితాబ్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్యార్థి తండ్రితో టీచరమ్మ పరిచయం - అఫైర్.. ఆపై రూ.20 లక్షల డిమాండ్

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments