Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మిస్టర్ కె' షూటింగులో గాయపడిన అమితాబ్ .. ముంబై నివాసంలో విశ్రాంతి

Webdunia
సోమవారం, 6 మార్చి 2023 (11:49 IST)
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ షుటింగులో గాయపడ్డారు. హైదరాబాద్ నగరంలో జరుగుతున్న ఒక చిత్రం షూటింగులో ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ముంబైకు వెళ్లి తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇంటర్నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా "మిస్టర్ కె" పేరుతో ఓ భారీ ప్రాజెక్టు తెరకెక్కుతుంది. 
 
హైదరాబాద్ నగరంలోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుంది. ఇక్కడ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఆ సమయంలో అమితాబ్ ప్రమాదానికు గురయ్యారు. ప్రమాదంలో ఆయన పక్కటెముక మృదులాస్థి విరిగిందని, కుడి పక్కటెముక కండరం చిరిగిపోయిందని అమితాబ్ బచ్చన్ స్వయంగా తన బ్లాగులో రాసుకొచ్చారు.
 
ఈ ప్రమాదంలో తాను గాయపడటంతో షూటింగును రద్దు చేశారని వెల్లడించారు. అయితే, ఈ ప్రమాదం నాలుగు రోజుల క్రితం జరిగింది. ఈ విషయాన్ని అమితాబ్ స్వయంగా తన బ్లాగులో రాసేంత వరకు ఏ ఒక్కరికీ తెలియదు. ప్రస్తుతం ఆయన ముంబైలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. కాగా, ఆయన కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అహ్మదాబాద్ విమాన ప్రమాదం .. వలంటీర్ల ముసుగులో హాస్టల్‌లో దోపిడీ

ఆ విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ ప్రయాణీకులున్నారు.. ఇంకా? (video)

Ahmedabad Plane Crash: ఏపీ వార్షిక విజయోత్సవాలు వాయిదా

Good Bye India, విమాన ప్రమాదానికి ముందు బ్రిటిష్ పౌరుల సెల్ఫీ వీడియో (video)

పక్షి ఢీకొట్టడం వల్లే విమాన ప్రమాదమా? పైలెట్ నుంచి మే డే కాల్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments