Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మిస్టర్ కె' షూటింగులో గాయపడిన అమితాబ్ .. ముంబై నివాసంలో విశ్రాంతి

Webdunia
సోమవారం, 6 మార్చి 2023 (11:49 IST)
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ షుటింగులో గాయపడ్డారు. హైదరాబాద్ నగరంలో జరుగుతున్న ఒక చిత్రం షూటింగులో ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ముంబైకు వెళ్లి తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇంటర్నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా "మిస్టర్ కె" పేరుతో ఓ భారీ ప్రాజెక్టు తెరకెక్కుతుంది. 
 
హైదరాబాద్ నగరంలోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుంది. ఇక్కడ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఆ సమయంలో అమితాబ్ ప్రమాదానికు గురయ్యారు. ప్రమాదంలో ఆయన పక్కటెముక మృదులాస్థి విరిగిందని, కుడి పక్కటెముక కండరం చిరిగిపోయిందని అమితాబ్ బచ్చన్ స్వయంగా తన బ్లాగులో రాసుకొచ్చారు.
 
ఈ ప్రమాదంలో తాను గాయపడటంతో షూటింగును రద్దు చేశారని వెల్లడించారు. అయితే, ఈ ప్రమాదం నాలుగు రోజుల క్రితం జరిగింది. ఈ విషయాన్ని అమితాబ్ స్వయంగా తన బ్లాగులో రాసేంత వరకు ఏ ఒక్కరికీ తెలియదు. ప్రస్తుతం ఆయన ముంబైలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. కాగా, ఆయన కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్లీజ్.. చైనా అమ్మాయిలతో శారీరక సంబంధం వద్దు : అమెరికా

ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం.. ఆ బ్లాక్‌లోనే డిప్యూటీ సీఎం పేషీ!! (Video)

వలస విధానం మరింత కఠినతరం : హెచ్1బీ వీసాదారులకు హెచ్చరిక

తెలంగాణాలో రాగల రెండు రోజుల వడగండ్ల వానలు

మధ్యప్రదేశ్‌లో విషాదం : బావిలోని విషవాయువులకు 8 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments