Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుష్ప ఫోటోగ్రాఫర్ మృతి.. ఆస్పత్రికి వెళ్లే దారిలోనే ప్రాణాలు కోల్పోయాడు..

Webdunia
శుక్రవారం, 29 జనవరి 2021 (11:24 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా రేంజ్ సినిమా పుష్ప. ఈ సినిమా స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
 
ఈ మూవీకి ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న జి. శ్రీనివాస్ (54) మృతి చెందారు. ఇవాళ అర్థరాత్రి రాత్రి.. అంటే దాదాపు 1 గంటల ప్రాంతంలో రాజమండ్రిలో గుండెపోటుతో మరణించారు.
 
"పుష్ప" షూటింగ్ నిమిత్తం మారేడుమిల్లికి శ్రీనివాస్ వెళ్లాడు. అయితే.. అతనికి ఒంట్లో బాగుండకపోవడంతో అంబులెన్స్‌లో రాజమండ్రికి ఆయనను తరలించారు. కానీ శ్రీనివాస్‌ పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి వెళ్లే దారిలోనే మరణించాడు. 
 
ఈ ఘటనతో టాలీవుడ్‌ విషాద ఛాయలోకి వెళ్లింది. శ్రీనివాస్ దాదాపు 200 లకు పైగా సినిమాలకు స్టిల్ ఫోటోగ్రాఫర్ గా పనిచేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమర్తెలున్నారు. ఆయన మృతికి పలుగురు సిని ప్రముఖులు సంతాపం తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Raja Singh: ఇంటిదొంగలంతా ఒక్కటైయ్యారు- బీజేపీలో బీఆర్‌ఎస్ నిజమేనేమో: రాజా సింగ్

Jagan: వైకాపా నేతలపై కేసుల బెడద: లీగల్ టీమ్‌పై దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి

మహానాడులో మోస్ట్ మెచ్యూర్డ్‌గా నారా లోకేష్ స్పీచ్.. ఏడుసార్లు గుజరాత్‌లో?

Vamsi: రాజకీయాల్లోకి వల్లభనేని వంశీ సతీమణి పంకజ శ్రీ: గన్నవరంలో ప్రకటన?

విజిలెన్స్ అధికారులు వస్తున్నారని రూ. 500 కరెన్సీ నోట్లను కిటికీ నుంచి విసిరేసిన అవినీతి తిమింగలం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments