Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబాయ్‌లో ఉన్న అల్లు అర్జున్ బంపర్ ఆఫర్..

ఓవర్‌సీస్‌ మార్కెట్‌ను బాగా క్యాష్‌ చేసుకునేందుకు యువ హీరోలు విదేశాల్లో షూటింగ్‌లు, ఆడియో వేడుకలు చేస్తున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్‌ కూడా అదే చేస్తున్నాడు. ఇప్పటికే దర్శకుడు హరీష్‌ శంకర్‌ డైరెక్ట్ చ

Webdunia
సోమవారం, 6 మార్చి 2017 (16:43 IST)
ఓవర్‌సీస్‌ మార్కెట్‌ను బాగా క్యాష్‌ చేసుకునేందుకు యువ హీరోలు విదేశాల్లో షూటింగ్‌లు, ఆడియో వేడుకలు చేస్తున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్‌ కూడా అదే చేస్తున్నాడు. ఇప్పటికే దర్శకుడు హరీష్‌ శంకర్‌ డైరెక్ట్ చేస్తున్న చిత్రం 'దువ్వాడ జగన్నాథం'. టీజర్‌ విడుదలలో డివైడ్‌ టాక్‌ రావడంతో దాన్ని బాగా పబ్లిసిటీకి ఉపయోగించుకున్నారు. చిత్రీకరణ 70 శాతం పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షెడ్యూల్‌ దుబాయిలో అబుదాబిలో జరుగుతోంది. 
 
అక్కడ అల్లు అర్జున్‌, పూజ హెగ్డేలపై పాటల చిత్రీకరణ జరుగుతోంది. ఈ పాటల్లో అల్లు అర్జున్‌ వేయబోయే స్టెప్స్‌ అభిమానులను అమితంగా ఆకట్టుకుంటాయని, సినిమాకి మరింత బలాన్ని చేకూరుస్తాయని వినికిడి. తాజాగా అల్లు అర్జున్‌ అబుదాబి సెట్స్‌‌లో ఉన్న తనను అభిమానులు వచ్చి కలుసుకోవచ్చని బంపరాఫర్‌ కూడా ప్రకటించాడు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మే నెల మధ్యలో విడుదలయ్యే అవకాశాలున్నాయి.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments