Webdunia - Bharat's app for daily news and videos

Install App

"అల వైకుంఠపురములో" మేకింగ్ వీడియో... నిర్మాతను నేనేనంటున్న బుడతడు!!

Webdunia
శుక్రవారం, 10 జనవరి 2020 (13:45 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందించిన చిత్రం అల వైకుంఠపురములో. ఈనెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. పూజా హెగ్డే హీరోయిన్ కాగా, సీనియర్ టబు కీలక పాత్రలో నటించింది. వీరితోపాటు.. మలయాళ నటుడు జయరాం , మురళీశర్మ, తమిళ నటుడు సముద్రఖని కూడా నటించారు. 
 
ఈ చిత్రం విడుదలకు మరికొన్ని గంటలే ఉన్న తరుణంలో చిత్ర యూనిట్ ఓ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో హీరో అల్లు అర్జున్ తన భార్యాపిల్లలతో సందడి చేస్తున్నారు. ముఖ్యంగా, బన్నీ కుమారుడు అల్లు అయాన్ మేకింగ్ వీడియోలో అల్లు అయాన్, కెమెరా నుండి చూస్తూ ఈ సినిమాకు నేనే నిర్మాత‌ను అని చెప్పి నిర్మాత‌ల‌కు షాకివ్వ‌డం కొస‌మెరుపు.
 
కాగా, ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణలు సంయుక్తంగా గీతాఆర్ట్స్-2, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మించారు. అల వైకుంఠపురములో చిత్రానికి అద్భుతమైన సంగీత బాణీలను ఎస్. థమన్ సమకూర్చగా, ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయిన విషయం తెల్సిందే. ఈ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసిన గంట వ్యవధిలోనే లక్షన్నర మంది నెటిజన్లు వీక్షించారు.
 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments