Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీ ధరకు అల వైకుంఠపురములో రైట్స్.. ఆ సంస్థ దక్కించుకుందా?

Webdunia
శనివారం, 7 డిశెంబరు 2019 (18:45 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అల వైకుంఠపురములో. బన్నీ సరసన రెండవ సారి పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ సినిమాకు యువ సంగీత తరంగం ఎస్ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తుండగా పీఎస్ వినోద్ ఫోటోగ్రఫీని అందిస్తున్నారు. బన్నీ, త్రివిక్రమ్‌ల కాంబినేషన్లో రాబోతున్న మూడవ సినిమా కావడంతో దీనిపై బన్నీ ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా భారీగా అంచనాలు ఉన్నాయి. 
 
సీనియర్ హీరోయిన్ టబు ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో అక్కినేని సుశాంత్, నివేత పేతురాజ్, సునీల్, రాహుల్ రామకృష్ణ, నవదీప్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. బన్నీ ఒక సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్‌గా నటిస్తున్న ఈ సినిమాలో, అదే కంపెనీ సీఈవోగా పూజాహెగ్డే నటిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఆయన తండ్రి పాత్రలో మురళి శర్మ నటిస్తున్నారు.
 
ఇటీవల ఈ సినిమా శాటిలైట్ హక్కులను జెమినీ టీవీ దక్కించుకోగా, తాజాగా ఈ సినిమా డిజిటల్ ప్రసార హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది.

సంబంధిత వార్తలు

EVMను ధ్వంసం చేసిన వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - video

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments