Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరో ఎవరు?

Webdunia
శుక్రవారం, 23 ఆగస్టు 2019 (10:56 IST)
దేశంలో అనేక మంది అగ్రనుటులు ఉన్నారు. బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్, తెలుగులో చిరంజీవి, తమిళంలో రజినీకాంత్ ఇలా అనేక మంది స్టార్లు ఉన్నారు. అయితే, దేశంలో ఉన్న హీరోల్లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోలు ఎవరన్నదానిపై ఇప్పటివరకు స్పష్టమైన క్లారిటీ లేదు. 
 
కానీ, అమెరికాకు చెందిన ఫోర్బ్స్ మ్యాగజైన్ పత్రిక తాజాగా ఓ విషయాన్ని వెల్లడించింది. 2018 జూన్ 1 నుంచి 2019 జూన్ 1 వరకు ఆయా నటుల సంపదను లెక్కించి ఆయా స్టార్ల వార్షిక పారితోషికాన్ని వెల్లడించింది. భారతీయ నటుల్లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోల్లో అక్షయ్ కుమార్ మొదటి స్థానంలో ఉన్నట్టు తెలిపింది. 
 
2019 సంవత్సరానికి గానూ ఫోర్బ్స్ మేగజైన్ అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుల వివరాలు తెలియజేసింది. ఓవరాల్‌గా చూస్తే హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్ 89.4 మిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో ఉండగా, క్రిస్ హెమ్స్‌వర్త్ 76.4 మిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉన్నాడు.
 
బాలీవుడ్ స్టార్, జాతీయ అవార్డు గ్రహీత అక్షయ్ కుమార్ 65 మిలియన్ డాలర్లతో నాలుగో స్థానాన్ని ఆక్రమించాడు. జాకీ చాన్ ఐదో స్థానంలో ఉండగా, భారతీయ నటుల్లో అక్షయ్ ఒక్కడే టాప్ టెన్‌లో చోటు దక్కించుకోవడం విశేషం. మొత్తంగా చూసినైట్లెతే, భారత్ తరఫున అక్షయ్ మొదటి స్థానంలో ఉన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రోడ్డు దాటుతున్న అమ్మాయిలను తాకిన వారి కీళ్లు ఇరగ్గొట్టిన పోలీసులు (video)

Tantrik: తాంత్రికుడిచ్చిన సలహా.. మనవడిని చంపిన తాతయ్య.. కారణం తెలిస్తే షాకవుతారు?

ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ కేసు : లక్ష్మీ మీనన్‌కు భారీ ఊరట

బిచ్చగాళ్లపై మిజోరం సర్కారు ఉక్కుపాదం

Floods : నిర్మల్ జిల్లాలో భారీ వరదలు.. హైవేలోకి వరదలు.. ట్రాఫిక్ మళ్లింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments