Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి అయితే... సో వాట్ : సైరా ప్రచారానికి దూరంగా నయనతార

Webdunia
శుక్రవారం, 23 ఆగస్టు 2019 (10:39 IST)
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం "సైరా నరసింహా రెడ్డి". అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో నిర్మించగా, వచ్చే నెల రెండో తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఇందులో హీరోయిన్‌గా నయనతార నటించగా, అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుధీప్, విజయ్ సేతుపతి, రవికిషన్, తమన్నా వంటి వారు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
 
ఈ చిత్రం ప్రచార కార్యక్రమాలు ఇటీవల మొదలయ్యాయి. ఇటీవల ముంబైలో జరిగిన సైరా టీజర్‌ లాంచ్‌ కార్యక్రమంలో ఒక్క నయనతార మినహా మిగిలిన అగ్ర నటీనటులంతా పాల్గొన్నారు. దీంతో నయనతార.. 'సైరా' ప్రచార కార్యక్రమాల్లో కనిపించటం కూడా అనుమానమే అన్న టాక్‌ వినిపిస్తోంది.
 
మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్న 'సైరా నరసింహారెడ్డి' సినిమాకు సురేందర్‌ రెడ్డి దర్శకుడు. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కించారు. 
 
నిజానికి నయనతార సినిమాలో నటించిన తర్వాత ఆ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉంటారు. ఈ పంథానే సైరా నరసింహా రెడ్డికి కూడా ఆమె అనుసరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇతర హీరోల చిత్రాలమాదిరిగానే చిరంజీవి చిత్రాన్ని కూడా ఆమె చూస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments