Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి అయితే... సో వాట్ : సైరా ప్రచారానికి దూరంగా నయనతార

Webdunia
శుక్రవారం, 23 ఆగస్టు 2019 (10:39 IST)
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం "సైరా నరసింహా రెడ్డి". అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో నిర్మించగా, వచ్చే నెల రెండో తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఇందులో హీరోయిన్‌గా నయనతార నటించగా, అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుధీప్, విజయ్ సేతుపతి, రవికిషన్, తమన్నా వంటి వారు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
 
ఈ చిత్రం ప్రచార కార్యక్రమాలు ఇటీవల మొదలయ్యాయి. ఇటీవల ముంబైలో జరిగిన సైరా టీజర్‌ లాంచ్‌ కార్యక్రమంలో ఒక్క నయనతార మినహా మిగిలిన అగ్ర నటీనటులంతా పాల్గొన్నారు. దీంతో నయనతార.. 'సైరా' ప్రచార కార్యక్రమాల్లో కనిపించటం కూడా అనుమానమే అన్న టాక్‌ వినిపిస్తోంది.
 
మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్న 'సైరా నరసింహారెడ్డి' సినిమాకు సురేందర్‌ రెడ్డి దర్శకుడు. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కించారు. 
 
నిజానికి నయనతార సినిమాలో నటించిన తర్వాత ఆ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉంటారు. ఈ పంథానే సైరా నరసింహా రెడ్డికి కూడా ఆమె అనుసరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇతర హీరోల చిత్రాలమాదిరిగానే చిరంజీవి చిత్రాన్ని కూడా ఆమె చూస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments