Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ సినిమా విషయంలో అసలు విషయం బయటపెట్టిన అఖిల్

Webdunia
శనివారం, 19 సెప్టెంబరు 2020 (11:10 IST)
అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు - వాసు వర్మ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
 
ఈ సినిమా జనవరి 21న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే, అఖిల్ మీడియాతో మాట్లాడుతూ.. సురేందర్ రెడ్డితో చేస్తున్న మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటపెట్టాడు. ఇంతకీ ఏమన్నాడంటే... సురేందర్ రెడ్డితో ఎప్పటి నుంచో సినిమా చేయాలనుకుంటున్నాను. అది ఇప్పటికి కుదరింది. ఈ సినిమా మామూలుగా ఉండదు. ధూమ్ థామ్‌గా ఉంటుంది. యాక్షన్ ఉంటుంది.
 
అలాగే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేద్దామా అని ఎదురుచూస్తున్నాను అని అఖిల్ చెప్పాడు. అఖిల్ ఇలా చెప్పినప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయని చెప్పచ్చు. ఈ సినిమాని అనిల్ సుంకర భారీ స్ధాయిలో నిర్మిస్తున్నారు. సమ్మర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి.. ఈ సినిమాతో అభిమానులు ఆశించిన విజయం సాధిస్తాడని.. బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తాడని ఆశిద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments