Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో అజిత్ కుమార్‌కు పితృవియోగం.. అనారోగ్యంతో చెన్నైలో కన్నుమూత

Webdunia
శుక్రవారం, 24 మార్చి 2023 (12:26 IST)
కోలీవుడ్ అగ్రనటుడు అజిత్ కుమార్‌కు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి పీ.ఎస్.మణి అనారోగ్యంతో శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 85 యేళ్లు. గత నాలుగేళ్లుగా ఆయన మంచానికే పరిమితమైవున్నారు. ఈ క్రమంలో ఆయన శుక్రవారం ఉదయం నిద్రలోనే తుదిశ్వాస విడిచినట్టు అజిత్ కుటుంబ సభ్యులు విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. 
 
కాగా, నాలుగేళ్లుగా పక్షవాతంతో బాధపడుతూ మంచానికే పరిమితమైన తన తండ్రికి ప్రేమతో వైద్యం చేసిన వైద్యులకు, వైద్య సిబ్బందికి, కుటుంబ సభ్యులకు, సహకరించిన ప్రతి ఒక్కరికీ రుణపడివుంటామన్నారు. మా నాన్నగారు దాదాపు అరవై ఏళ్లపాటు మా అమ్మ ప్రేమ, అంకితభావంతో మంచి జీవితాన్ని గడిపారని అజిత్ పేర్కొన్నారు. 
 
ఈ విషాద సమయంలో, మా నాన్న మరణవార్త గురించి ఆరా తీయడానికి, మా కుటుంబాలను ఓదార్చడానికి చాలా మంది మాకు ఫోన్, మొబైల్ లేదా మెసేజ్‌లు పంపుతుంటారు. ప్రస్తుత వాతావరణంలో మీ కాల్‌కు లేదా ప్రత్యుత్తరం ఇవ్వలేకపోతున్నామని అర్థం చేసుకోండి. మా నాన్నగారి అంత్యక్రియలను కుటుంబ సమేతంగా నిర్వహిస్తాం. కావున, ఈ మరణం గురించి తెలిసిన వారందరూ మా బాధను, నష్టాన్ని అర్థం చేసుకుని కుటుంబ సభ్యులతో కలిసి సంతాపాన్ని పాటించి అంత్యక్రియలు ఏకాంతంగా నిర్వహించాలని ప్రార్థిస్తున్నాం అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భూమ్మీద ఇంకా నూకలున్నాయ్ ... ఒకే ఒక మృత్యుంజయుడు... (Video)

ఎయిరిండియా విమానం ఎలా కూలిపోయిందో చూడండి (Video)

ఎయిర్ ఇండియా ప్రమాదం: ముగ్గురు పిల్లలు, తల్లిదండ్రులు మృతి.. సెల్ఫీ ఫోటో వైరల్

భర్తను చూసేందుకు వెళుతూ మృత్యుఒడికి చేరుకున్న నవవధువు !!

విమాన ప్రమాదంలో మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments