Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రయాణికులను టార్చర్ పెట్టి ఆనందం పొందుతున్న ఎయిరిండియా : మంచు లక్ష్మీ

Webdunia
గురువారం, 18 అక్టోబరు 2018 (12:59 IST)
ఎయిరిండియా అధికారులపై టాలీవుడ్ హీరోయిన్ మంచు లక్ష్మీ మరోమారు మండిపడింది. ప్రయాణికులను టార్చర్ పెట్టి ఎయిరిండియా అధికారులు ఆనందం పొందుతున్నారంటూ ఆమె తీవ్ర విమర్శలు గుప్పించింది. 
 
ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎలాంటి కారణం చెప్పకుండా దాదాపు 4 గంటల పాటు తనను క్యూలైనులో నిలబెట్టారంటూ వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఆమె గురువారం వరుస ట్వీట్లు చేసింది. 
 
ప్రయాణికులను ఎయిర్ ఇండియా అధికారులు కనీసం పట్టించుకోలేదని వ్యాఖ్యానించింది. దీంతో ఆహారం, నీళ్లు లేకుండా పలువురు ప్రయాణికులు పుణె ఎయిర్ పోర్టులో చిక్కుకున్నారని తెలిపింది.
 
నిజానికి ఎయిర్ ఇండియా విమానం బుధవారం మధ్యాహ్నం 12.15 గంటలకు తొలుత బయలుదేరాల్సి ఉందని లక్ష్మి చెప్పింది. అయితే మరో నాలుగు గంటలైనా విమానం జాడ లేకుండా పోయిందని వెల్లడించింది. 
 
ఈ విషయంపై తాము గట్టిగా నిలదిస్తే ఎయిర్ ఇండియా అధికారి సమాధానం చెప్పకుండానే పారిపోయారని తెలిపింది. చివరికి తాను హైదరాబాద్‌కు ఫోన్ చేసి అడిగితేగానీ, వాతావరణం బాగోలేని కారణంగానే విమానం రద్దయినట్లు తెలిసిందని మంచు లక్ష్మి చెప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh: తల్లికి వందనం పథకంలో రెండు వేలు నా జేబులో పడ్డాయా? నిరూపించకపోతే? (video)

NEET UG 2025 results: నీట్ యూజీ 2025 ఫలితాలు.. టాప్‌లో మహేష్ కుమార్

గుడిలో భార్య కాళ్లకు భర్త నమస్కారం, బుద్ధిలేదా అంటూ బామ్మ ఆగ్రహం (video)

ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య ఇంట్లో వ్యక్తిగత సహాయకుడు ఆత్మహత్య, అదే కారణమా?

Thalliki Vandanam: తల్లికి వందనం స్కీమ్.. తండ్రీకొడుకుల అనుబంధం.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments