Webdunia - Bharat's app for daily news and videos

Install App

RGV 'వ్యూహం' చూశాక YCP 'అరాచకం' సినిమా తీస్తా, ఆ పార్టీకి 29 సీట్లే: నట్టి కుమార్

Webdunia
గురువారం, 28 డిశెంబరు 2023 (18:20 IST)
రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం చిత్రంపై రచ్చ జరుగుతోంది. అటు జనసేన ఇటు తెదేపా కార్యకర్తలు ఈ చిత్రాన్ని విడుదల చేయరాదంటూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టీవీ చర్చలో పాల్గొన్న ఉద్యమ నాయకుడు ఏకంగా వర్మపైన మరింత తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అది కేసు నమోదు వరకూ వెళ్లింది. కాగా ఈచిత్రం రేపు విడుదల కావాల్సి వుంది.
 
మరోవైపు ఈ చిత్రం గురించి సినీ నిర్మాత నట్టి కుమార్ స్పందించారు. ఆర్జీవి తెరకెక్కించిన వ్యూహం సినిమా తాను చూస్తానని అన్నారు. ఐతే ఈ చిత్రం చూసిన వెంటనే తను కూడా వైసిపి అరాచకాలపై అరాచకం సినిమా తెరకెక్కిస్తానన్నారు. ఈ చిత్రంలో ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య, వైసిపి ఎంపి రఘురామ కృష్ణంరాజుపై చిత్ర హింసలు ఇత్యాది వైసిపి అరాచకాలపై పూర్తి వివరాలతో సినిమా తీస్తానని చెప్పారు.
 
ఏపీ ప్రజలు వైసిపిపై తీవ్ర అసంతృప్తితో వున్నారనీ, ఆ పార్టీకి వచ్చే ఎన్నికల్లో 29 సీట్ల కంటే ఎక్కువ రావని జోస్యం చెప్పారు. తెదేపా-జనసేన కూటమికి 130 నుంచి 150 సీట్లు వస్తాయని అన్నారు. త్వరలో తను చంద్రబాబు నాయుడుతో సమావేశమవుతాననీ, ఆ తర్వాత తను రాజకీయ కార్యాచరణ గురించి చెబుతానన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియుడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడనీ... భగ్నప్రేమికురాలి బాంబు బెదిరింపులు

పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది.. ఎన్నికల్లో విజయం మాదే : సజ్జల

Airspace ban: గగనతల మూసివేతను జూలై 24 వరకు పొడిగించిన భారత్

LPG: లీక్ అయిన ఎల్పీజీ సిలిండర్.. కాసేపయ్యాక భారీ పేలుడు.. ఆ ఇద్దరికి ఏమైంది..? (video)

గబ్బర్ సింగ్ డైలాగ్‌లు కొట్టిన పవన్.. రబ్బరులా వణికిపోతున్నారు- ఆర్కే రోజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments