Webdunia - Bharat's app for daily news and videos

Install App

RGV 'వ్యూహం' చూశాక YCP 'అరాచకం' సినిమా తీస్తా, ఆ పార్టీకి 29 సీట్లే: నట్టి కుమార్

Webdunia
గురువారం, 28 డిశెంబరు 2023 (18:20 IST)
రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం చిత్రంపై రచ్చ జరుగుతోంది. అటు జనసేన ఇటు తెదేపా కార్యకర్తలు ఈ చిత్రాన్ని విడుదల చేయరాదంటూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టీవీ చర్చలో పాల్గొన్న ఉద్యమ నాయకుడు ఏకంగా వర్మపైన మరింత తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అది కేసు నమోదు వరకూ వెళ్లింది. కాగా ఈచిత్రం రేపు విడుదల కావాల్సి వుంది.
 
మరోవైపు ఈ చిత్రం గురించి సినీ నిర్మాత నట్టి కుమార్ స్పందించారు. ఆర్జీవి తెరకెక్కించిన వ్యూహం సినిమా తాను చూస్తానని అన్నారు. ఐతే ఈ చిత్రం చూసిన వెంటనే తను కూడా వైసిపి అరాచకాలపై అరాచకం సినిమా తెరకెక్కిస్తానన్నారు. ఈ చిత్రంలో ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య, వైసిపి ఎంపి రఘురామ కృష్ణంరాజుపై చిత్ర హింసలు ఇత్యాది వైసిపి అరాచకాలపై పూర్తి వివరాలతో సినిమా తీస్తానని చెప్పారు.
 
ఏపీ ప్రజలు వైసిపిపై తీవ్ర అసంతృప్తితో వున్నారనీ, ఆ పార్టీకి వచ్చే ఎన్నికల్లో 29 సీట్ల కంటే ఎక్కువ రావని జోస్యం చెప్పారు. తెదేపా-జనసేన కూటమికి 130 నుంచి 150 సీట్లు వస్తాయని అన్నారు. త్వరలో తను చంద్రబాబు నాయుడుతో సమావేశమవుతాననీ, ఆ తర్వాత తను రాజకీయ కార్యాచరణ గురించి చెబుతానన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హిమాచల్ ప్రదేశ్ కులూలో ప్రకృతి బీభత్సం

నెల్లూరు జిల్లా జీవిత ఖైది రాసలీలలు, మహిళకు నూనె పూసి...

మరింతగా ముదరనున్న ఓట్ల చోరీ కేసు : సీఈసీపై విపక్షాల అభిశంసన!?

పాకిస్థాన్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు - 657 మంది మృతి (video)

భర్త మొబైల్ ఫోన్ ఇవ్వలేదని భార్య ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments