Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాన్నగారిని ఎంజీఎం సిబ్బంది కంటికి రెప్పలా చూసుకున్నారు..

Webdunia
సోమవారం, 28 సెప్టెంబరు 2020 (10:12 IST)
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి తర్వాత ఆయనకు సంబంధించి అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బాలు మృతి వెనుక పెద్ద కుట్ర జరిగిందని, మనీ కోసం ఆయనని చాలా వేధించారని జోరుగా ప్రచారం జరిగింది. ఈ విషయం బాలు కుమారుడు చరణ్ దృష్టికి రాగా, ఆయన ఓ వీడియో ద్వారా పుకార్లపై క్లారిటీ ఇచ్చారు.
 
"ఆస్పత్రిలో నాన్నగారి చికిత్సకు సంబంధించి ఎలాంటి వివాదం లేదని చెప్పారు. హాస్పిటల్ బిల్లు విషయంలో అసత్య ప్రచారం జరుగుతోంది. ఎంజీఎం సిబ్బంది నాన్నగారిని కంటికి రెప్పలా చూసుకున్నారు. ప్రార్ధనలు కూడా చేశారు. దయ చేసి తప్పుడు ప్రచారాలు చేయకండి. నాన్న గారిని అభిమానించే వాళ్ళు ఇలా చేయకూడదు. ఈ సమయంలో ఇలాంటి రూమర్స్ మమ్మల్ని మరింతగా బాధపెడతాయి. దయచేసి గమనించండి'' అని చరణ్ పేర్కొన్నారు.
 
మరోవైపు బాలుకు సంబంధించిన ఎంజీఎం హాస్పిటల్‌ బిల్లును ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్ చెల్లించారనే వార్తలపై ఆమె స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఇందులో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. కాగా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ నెల 25న తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NASA: నాసా అధికారిక వెబ్‌సైట్‌లో బగ్‌ను గుర్తించిన 16 ఏళ్ల బాలుడు.. హ్యాట్సాఫ్!

బాలికలకు హాని చేయాలంటేనే భయపడాలి.. తాట తీయండి: చంద్రబాబు

హైదరాబాద్‌తో తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలెర్ట్.. భారీ వర్షాలకు అవకాశం

DOST 2025: వెబ్‌సైట్‌లో సెల్ఫ్ -రిపోర్ట్ చేయడంలో 19వేల మంది అభ్యర్థులు విఫలం

మూర్ఖులను అంత తేలిగ్గా తీసుకోవద్దు - హనీమూన్ మర్డర్‌పై కంగనా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments