Webdunia - Bharat's app for daily news and videos

Install App

23కే అన్ని చూపించేశా... ఒక రాత్రికి రూ.15 లక్షలు : షకీలా

Webdunia
మంగళవారం, 30 జులై 2019 (13:41 IST)
సౌత్ ఇండియన్ పోర్న్ స్టార్ షకీలా. తాను కరిగిపోతూ సినీ ప్రపంచానికి వెలుగునిచ్చింది. ఇపుడు ఆమె వయసు 43 యేళ్లు. కానీ, తన అందచందాలను తన 23 యేళ్ళ ప్రాయంలోనే ఈ లోకానికి చూపించినట్టు చెప్పింది. పైగా, ఒక చిత్రంలో నటిస్తే రూ.3 లక్షలు ఇచ్చేవారు. కానీ, ఒక రాత్రికి పడకసుఖం ఇస్తే రూ.15 లక్షలు ఇస్తామన్నారు. కానీ, దేవుడిని మోసం చేయలేక రూ.15 లక్షలు వద్దని చెప్పా. అయితే, తనకు ఏడెనిమిది మందితో రిలేషన్ ఉండేది. చివరగా నితీశ్ కుమార్‌తో సంబంధం ఉండగా, మా లింకు పదేళ్లపాటు కొనసాగిందని సౌత్ ఇండియన్ శృంగార తార షకీలా చెప్పుకొచ్చింది. 
 
తాజాగా తన ఒంటరి జీవితంపై సినీ నటి షకీలా స్పందించింది. తాను పెళ్లి చేసుకోలేదనీ, పిల్లలు లేరని అందువల్ల తన భవిష్యత్ ఏంటో తెలియదని షకీలా చెప్పుకొచ్చింది. ఆమె తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో అనేక విషయాలను వెల్లడించింది. సినీ ఇండస్ట్రీలో తాను మంచి పీక్ స్టేజీలో ఉన్నపుడు సంపాదించిన డబ్బునంతా మా అమ్మ, అక్క కుటుంబానికే వెచ్చించానని చెప్పింది. 
 
ముఖ్యంగా, మా అక్క చిన్నకుమార్తె డాక్టర్ కావడం కోసం తన పేరున ఉండే ఇంటి స్థలం కూడా ఇచ్చేశానని, అలాంటి అమ్మాయి కూడా ఇపుడు తనతో మాట్లాడటం మానేసిందని చెప్పుకొచ్చింది. పైగా, మా అక్కయ్యకి, భర్త, పిల్లలు ఉన్నారు. వీరంతా తన నుంచి సాయం పొంది ఇపుడు మాట్లాడటం మానేశారన్నారు. వాళ్లంతా కలిసికట్టుగా తనను ఒంటరిదాన్ని చేశారన్న భావన వచ్చినపుడు బోరున ఏడ్చిన రోజులు అనేకం ఉన్నాయన్నారు. 
 
నేను మా అక్కయ్యను కూడా అమ్మలాగే భావించేదాన్ననీ, ఆమె చెప్పినట్టు నడుచుకున్నానని షకీలా చెప్పింది. తాను కష్టాల్లో ఉన్నానని తెలిసి కూడా మా అక్కయ్య కనీసం ఎలా ఉన్నావనీ అడగక పోవడాన్ని నేను తట్టుకోలేక పోతున్నట్టు షకీలా చెప్పుకొచ్చింది. నేను సంపాదించిన ఆస్తులన్నీ చేజారిపోవడానికి ప్రధాన కారణం మా అక్కయ్యే.. ఆమెను గుడ్డిగా నమ్మడం వల్లే నాకు దుస్థితి ఏర్పడింది అంటూ వాపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రపంచంలో భయాందోళనలను సృష్టించిన ఇరాన్ సైనిక సామర్థ్యం

రూ.50వేల అప్పు తీర్చేందుకు భార్యను అమ్మేశాడు.. స్నేహితుడితో అత్యాచారం చేయించాడు..

వ్యూస్ కోసం చీర చెంగుకి నిప్పంటించుకుని డ్యాన్స్ చేసిన మహిళ (video)

జూలై ఒకటో తేదీ నుంచి పెరగనున్న రైల్వే చార్జీలు?

Ponnam: జూలై 13న బోనాలు.. ప్రజల సహకారం అవసరం.. పొన్నం ప్రభాకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

తర్వాతి కథనం