Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్-3 ఫేం దర్శన్ వాడుకుని వదిలేశాడంటున్న తమిళ సినీ నటి! (Video)

Webdunia
మంగళవారం, 6 అక్టోబరు 2020 (14:56 IST)
తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ సినీ నటి చెన్నై పోలీసులను ఆశ్రయించింది. తనను బిగ్ బాస్-3 తమిళ ఫేం దర్శన్ త్యాగరాజన్ మోసం చేశాడని ఆరోపించింది. ఒక యేడాది రిలేషన్ పేరుతో తనను వాడుకుని ఇపుడు వదిలేశాడనీ ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు... ఆ దర్శకుడి కోసం గాలిస్తున్నారు. 
 
ఇంతకీ పోలీసులకు ఫిర్యాదు చేసిన తమిళ నటి సనమ్ శెట్టి. ఈమె మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. 
 
కాలక్రమంలో ఆమెకు బిగ్ బాస్-3 ఫేం దర్శన్‌ త్యాగరాజన్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇది కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత వారిద్దరూ ఒక యేడాది పాటు సహజీవనం చేశారు. ఆ తర్వాత ఏమైందో కానీ సనమ్‌తో దర్శన్ బంధాలను తెంచుకున్నాడు. దీంతో సనమ్ పోలీసులను ఆశ్రయించింది.
 
మలేషియాలో ఉంటున్న దర్శన్ తనను ప్రేమిస్తున్నానని చెప్పి, మోసగించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు చెన్నైలోని అడయార్ పోలీస్ స్టేషనులో ఆమె ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్శన్ కోసం గాలిస్తున్నారు.
 
తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి, మోసం చేశాడని తన ఫిర్యాదులో సనమ్ పేర్కొంది. అతడిని కఠినంగా శిక్షించాలని కోరింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్శన్ కోసం గాలిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Raja Singh: ఇంటిదొంగలంతా ఒక్కటైయ్యారు- బీజేపీలో బీఆర్‌ఎస్ నిజమేనేమో: రాజా సింగ్

Jagan: వైకాపా నేతలపై కేసుల బెడద: లీగల్ టీమ్‌పై దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి

మహానాడులో మోస్ట్ మెచ్యూర్డ్‌గా నారా లోకేష్ స్పీచ్.. ఏడుసార్లు గుజరాత్‌లో?

Vamsi: రాజకీయాల్లోకి వల్లభనేని వంశీ సతీమణి పంకజ శ్రీ: గన్నవరంలో ప్రకటన?

విజిలెన్స్ అధికారులు వస్తున్నారని రూ. 500 కరెన్సీ నోట్లను కిటికీ నుంచి విసిరేసిన అవినీతి తిమింగలం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments