Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చిన నటి నమిత

Webdunia
శనివారం, 20 ఆగస్టు 2022 (08:35 IST)
సినీ నటి నమిత పండండి కవల పిల్లలకు జన్మించారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాఖాతాలో వెల్లడించారు. గత 2017లో నటుడు, వ్యాపారవేత్త అయిన వీరేంద్ర చౌదరిని ఆమె వివాహం చేసుకుని వైవాహిక జీవితంలో స్థిరపడిపోయిన విషయం తెల్సిందే. ఈ క్రమంలో ఆమె గర్భందాల్చి నెలలు నిండాయి. దీంతో చెన్నై క్రోంపేటలోని రేలా మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చారు. 
 
ఈ భార్యాభర్తలిద్దరూ తమ కవల పిల్లలను ఎత్తుకుని నిలబడిన ఫోటోలు, ఓ వీడియోను సోషల్ మీడియాలో నమిత షేర్ చేశారు. ఇందులో శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నందుకు ఆనందంగా ఉందన్నారు. 
 
అభిమానుల ఆశీస్సులు, ఆశీర్వాదాలు ఎల్లప్పుడు తమతో ఉంటాయన్నారు. ఇకపైనా అవి కొనసాగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శిశువులు, తాను ఆరోగ్యంగానే ఉన్నానని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments