Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగిలించిన వస్తువులు తెస్తానని చెప్పి మాపై కేసు పెట్టింది : భానుప్రియ

Webdunia
శుక్రవారం, 25 జనవరి 2019 (08:38 IST)
తన ఇంట్లో పని చేసే పని అమ్మాయిని తన సోదరుడు వేధించాడంటూ సామర్లకోట పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసుపై సినీ నటి భానుప్రియ స్పందించింది. కుమార్తె దొంగిలించిన వస్తువులు తీసుకొస్తానని చెప్పి.. చివరకు తమపైనే బాలిక తల్లి తమపైనే కేసు పెట్టిందని భానుప్రియ చెప్పుకొచ్చింది. 
 
తన తన ఇంట్లో పనిచేసే అమ్మాయిని వేధించారంటూ తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట పోలీస్ స్టేషన్‌లో భానుప్రియపై కేసు నమోదైంది. దీనిపై భానుప్రియ స్పందిస్తూ, సంధ్య(14) అనే బాలిక తమ ఇంట్లో సంవత్సర కాలంగా పనిచేస్తోందని.. ఈ క్రమంలో దాదాపు రూ.లక్షా 50 వేల విలువైన డబ్బు, బంగారం, కెమెరా, ఐప్యాడ్‌ను దొంగిలించిందని చెప్పింది. 
 
ఈ విషయమై సంధ్యను నిలదీసి అడిగితే కానీ నిజం చెప్పలేదని.. వెంటనే ఆమె తల్లికి ఫోన్ చేసి అమ్మాయిని తీసుకెళ్లమని చెప్పినట్టు భానుప్రియ తెలిపారు. సంధ్య తల్లి తన ఇంట్లో దొంగిలించిన కొన్ని వస్తువులను తెచ్చి ఇచ్చిందని.. మరికొన్నింటిని తీసుకొస్తానని వెళ్లి తనపైనే కేసు పెట్టడం ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. తనపై వస్తున్న ఆరోపణలన్నింటినీ అవాస్తవాలుగా కొట్టిపడేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

జనవరి నుంచి బైకులన్నింటికీ 'ఏబీఎస్' తప్పనిసరి : కేంద్రం నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments