Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

ఠాగూర్
సోమవారం, 19 మే 2025 (18:33 IST)
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కుటుంబ సభ్యుల్లో ఒకరికి కరోనా వైరస్ సోకింది. మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ సోదరి, ఒకప్పటి ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్‌కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని శిల్పా శిరోద్కర్ స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటున్న ఆమె.. తనకు కరోనా వైరస్ సోకినట్టు వెల్లడిస్తూ, ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని తప్పనిసరిగా ముఖానికి మాస్క్ ధరించాలని సూచించారు. 
 
కాగా, గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతోంది. ముఖ్యంగా, సింగపూర్, హాంకాంగ్, చైనా, థాయిలాండ్ వంటి ఆసియా దేశాల్లో ఈ వైరస్ బారినపడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సింగపూర్‌లో కరోనా పాజిటివ్ రోగుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. ఇక్కడ రోజుకు 2 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. 
 
అలాగే, హాంకాంగ్‌లోని ఆస్పత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోతున్నాయి. చైనాలోని కొన్ని నగరాల్లో మళ్లీ లాక్‌డౌన్ అమలు చేసే దిశగా అడుగులు పడుతున్నట్టు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో దుబాయ్‌లో ఉంటున్న శిల్పా శిరోద్కర్ కరోనా వైరస్ బారినపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments