Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో ప్రభాస్ బీపీఎల్ కాదు.. బాహుబలి : తెలంగాణ సర్కారు

Webdunia
శనివారం, 22 డిశెంబరు 2018 (10:37 IST)
హీరో ప్రభాస్‌కు ఉమ్మడి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. తన గెస్ట్ హౌజ్‌ను తెలంగాణ రెవెన్యూ అధికారులు సీజ్ చేయడంపై ఆయన కోర్టు మెట్లెక్కారు. ఈ సందర్భంగా "ప్రభాస్ బీపీఎల్ (బిలో పావర్టీ లైన్ - దారిద్ర్య రేఖకు దిగువున) వ్యక్తికాదనీ, బాహుబలి" అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తరపు అడ్వకేట్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 
 
తన స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోందని ఆరోపిస్తూ ప్రభాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. రాయదుర్గం పాన్‌మక్తాలోని సర్వేనెంబర్‌ 5/3లోని 2083 గజాల స్థలాన్ని 2005, 2006లో బి.వైష్ణవి రెడ్డి, రవీందర్‌ రెడ్డిల నుంచి ప్రభాస్‌ కొనుగోలు చేశారన్నారు. తమకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. క్రమబద్ధీకరణ కోరుతూ ఫీజును కూడా చెల్లించారని గుర్తుచేశారు. 
 
దీనికి ప్రభుత్వ తరపున స్పెషల్ జీపీ శరత్ కుమార్ స్పందిస్తూ, 'హీరో ప్రభాస్‌ భూమి క్రమబద్ధీకరించడానికి ఆయనేమీ నిరుపేద (బీపీఎల్‌) కాదు. ఆయన బాహుబలి. స్థలం క్రమబద్ధీకరణకు ఆయన చేసిన దరఖాస్తును 2015లో తిరస్కరించాం. పైగా ఆ భూములు ప్రభుత్వానివని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది' అని హైకోర్టుకు నివేదించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ నుంచి రాజ్యసభ స్థానానికి తమిళనాడు బీజేపీ నేత అన్నామలై?

ఈ రాత్రి నా భర్తను చంపేద్దాం.. ఆపై పామును వదిలేద్దాం.. పనైపోతుంది.. ప్రియుడితో..?

వైకాపాలో 2వ స్థానం నుంచి 2 వేల స్థానానికి చేర్చారు : విజయసాయి రెడ్డి (Video)

ఈపీఎఫ్‍‌వో వెర్షన్ 3.0తో సేవలు మరింత సులభతరం : కేంద్ర మంత్రి మాండవీయ

యునెస్కో రిజిస్టర్‌లో భగవద్గీత, నాట్యశాస్త్రం.. హర్షం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments