హీరో కాదు.. బౌన్సర్... ఇద్దరు సోదరులకు కంచెలా....

సినీ హీరో, టీడీపీ మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ తాజాగా నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆయన అంత్యక్రియలు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో పూర్తిచేశారు. ఈ అంత్యక్రియలకు నందమూరి అభిమానుల

Webdunia
శనివారం, 1 సెప్టెంబరు 2018 (09:18 IST)
సినీ హీరో, టీడీపీ మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ తాజాగా నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆయన అంత్యక్రియలు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో పూర్తిచేశారు. ఈ అంత్యక్రియలకు నందమూరి అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. దీంతో వారిని కంట్రోల్ చేయడం పోలీసులకు సైతం సాధ్యపడలేదు.
 
కానీ, ఓ హీరో బౌన్సర్‌గా మారి వారిని కట్టడి చేశారు. అంతేనా తండ్రిని కోల్పోయి దుఃఖంలో మునిగిపోయివున్న ఇద్దరు సోదరులకు ఇనుప కంచెలా ఉండి అంత్యక్రియల తతంతం సజావుగా పూర్తయ్యేలా చూశాడు. ఆ హీరో ఎవరో మంచు మనోజ్. హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌ రామ్‌లకు మంచి మిత్రుడు. 
 
తండ్రి మరణంతో ఆయన కుమారులైన కల్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్‌లు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అలాంటి పరిస్థితుల్లో అంత్యక్రియల సందర్భంగా తారక్, కల్యాణ్‌రామ్‌లను చూసేందుకు జనం ఎగబడ్డారు. సినీ ఇండస్ట్రీ ప్రముఖులు, హీరోలు అంతా అలా చూస్తూ మిన్నకుండిపోయారు. ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. 
 
దీంతో ఈ ఇద్దరు అన్నదమ్ముల కోసం మంచు మనోజ్ ఒక బౌన్సర్‌లా నిలబడ్డాడు. జనాన్ని కంట్రోల్ చేసుకుంటూ కార్యక్రమం పూర్తయ్యే వరకూ ధైర్యంగా నిలబడ్డాడు. దీనికి సంబంధించిన పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయడమే కాకుండా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మనోజ్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. సోషల్ మీడియాలో ఈ పిక్స్ చూసిన ప్రతి ఒక్కరూ మనోజ్‌ను అభినందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త లేని స్త్రీ మరొకడితో హాయిగా వుండకూడదా?

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

రీహాబిలిటేషన్-కేంద్రీకృత వికలాంగుల వాకథాన్‌ను నిర్వహించిన హెచ్ఏసిహెచ్ సువిటాస్

భద్రాద్రి రైల్వే స్టేషనులో బాంబు సంచిని కొరికిన కుక్క, పేలిపోయి ట్రాక్ మీద పడింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments