"ఆచార్య" ప్రిరిలీజ్ వేదికను మార్చారు...

Webdunia
ఆదివారం, 17 ఏప్రియల్ 2022 (15:48 IST)
మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రాంచరణ్ కలిసి నటించిన ఆచార్య చిత్రం ఈ నెల 29వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఇది చిరంజీవి 152వ చిత్రం. కొరటాల శివ దర్శకత్వం వహించారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ నటించారు. 
 
దేవాలయ భూములు కుంభకోణం నేపథ్యంలో సాగే సందేశాత్మక చిత్రం. ఇందులో చెర్రీ సిద్ధ అనే పాత్రను పోషించారు. చెర్రీకి జోడీగా పూజా హెగ్డే నటించారు. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే విడుదలై మంచి టాక్‌ను తెచ్చుకుంది. 
 
ఈ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీన ప్రిరిలీజ్ ఈవెంట్‌ను విజయవాడ వేదికగా మార్చాలని భావించారు. కానీ, చిత్రం యూనిట్ తన నిర్ణయాన్ని మార్చుకుంది. హైదరాబాద్ నగరంలో ఈ వేడుకను నిర్వహించాలని నిర్ణయించింది. 
 
నిజానికి విజయవాడలో జరిగే వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొంటారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈ వేడుక హైదరాబాద్‌కు మారింది కాబట్టి ముఖ్య అతిథి ఎవరు అనేది తెలియాల్సి ఉంది. కొన్ని అనివార్య కారణాల వాళ్ళ ఈ వేడుకను విజయవాడ నుంచి హైదరాబాద్‌కు మార్చినట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: అమరావతిలో 3300 కి.మీ సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ నెట్‌వర్క్‌

నేను, బ్రాహ్మణి ఇంటి పనులను సమానంగా పంచుకుంటాం.. నారా లోకేష్

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి, పరిసర ప్రాంతాల్లో నెట్‌వర్క్ నాణ్యతను పరీక్షించిన ట్రాయ్

ఫెయిల్ అయితే భారతరత్న అబ్దుల్ కలాంను గుర్తు తెచ్చుకోండి: చాగంటివారి అద్భుత సందేశం (video)

Matrimony Fraud: వరంగల్‌లో ఆన్‌లైన్ మ్యాట్రిమోని మోసం.. వధువు బంగారంతో పరార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments