ఆరేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం.. కోలీవుడ్ కమెడియన్ ఏబీ రాజు అరెస్ట్

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2022 (14:28 IST)
AB Raju
కోలీవుడ్ హాస్యనటుడు ఏబీ రాజు దారుణానికి పాల్పడ్డాడు. చాక్లెట్ ఆశ చూపించి ఆరేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కోలీవుడ్‌లో సంచలనంగా మారింది.  
 
వివరాల్లోకి వెళితే.. చెన్నైలో ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం వుంటున్న బీఏ రాజు.. అదే ప్లాటులో వుండే రెండో తరగతి చదివే చిన్నారిపై అత్యాచారయత్నం చేశాడు. 
 
చిన్నారిది రాజుగారి కింద ఫ్లాటే కావడంతో ఖాళీ దొరికినప్పుడల్లా రాజు ఇంటికి వెళ్లి ఆడుకొంటూ ఉంటుంది. ఈ క్రమంలో ఆగస్టు 14 రాత్రి చిన్నారి రాజు ఇంటికి వెళ్ళింది. ఇంట్లో ఎవరు లేకపోవడంతో రాజు బాలికను దగ్గరకు తీసుకొని చాక్లెట్ ఇస్తానని చెప్పి ఆమె ప్రైవేట్ భాగాలను తాకుతూ అత్యాచారం చేయడానికి యత్నించాడు. 
 
బాలిక ఏడవడం మొదలుపెట్టేసరికి ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాలిక ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు ఏమి చెప్పలేదు. అయితే అప్పటి నుంచి బాలిక ముభావంగా ఉండడంతో తల్లిదండ్రులు గట్టిగా అడగడంతో విషయం బయటపెట్టింది. 
 
దీంతో వెంటనే బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజును విచారించగా నేరాన్ని ఒప్పుకోవడంతో అతడిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సౌదీ అరేబియాలో హైదరాబాద్ యాత్రికుల మృతి.. రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి.. ఆదేశాలు జారీ

మక్కా నుండి మదీనాకు.. బస్సు డీజిల్ ట్యాంకర్ ఢీ- 42మంది హైదరాబాద్ యాత్రికుల మృతి (video)

కల్వకుంట్ల కవిత ఓవర్ కాన్ఫిడెన్స్.. శత్రువుగా చూస్తున్న బీఆర్ఎస్

ఉత్తరాంధ్ర.. శ్రీకాకుళంకు కొత్త విమానాశ్రయం.. రెండు రోజుల్లోనే రూ.13లక్షల కోట్లు

Vangaveeti: వంగవీటి కుటుంబం నుంచి రాజకీయాల్లోకి ఆశా కిరణ్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments