Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను - కీర్తన చిత్రంతో హీరోగా చిమటా రమేష్ బాబుకు మంచి పునాది!

డీవీ
శనివారం, 10 ఆగస్టు 2024 (14:39 IST)
Nenu keertana team
చిమటా రమేష్ బాబు హీరోగా, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన "నేను - కీర్తన" చిత్రం ప్రి రిలీజ్ మరియు ట్రైలర్ రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో అత్యంత ఘనంగా జరిగింది. చిత్ర యూనిట్ తోపాటు... ఈ వేడుకలో ప్రముఖ నిర్మాత డి.ఎస్.రావు, ప్రముఖ మహిళామణులు శోభారాణి, పద్మినీ నాగులపల్లి, గిడుగు కాంతికృష్ణ, వాసిరెడ్డి స్పందన పాల్గొని, "నేను - కీర్తన" చిత్రం చిమటా రమేష్ బాబుకు హీరోగా తిరుగులేని పునాది వేయాలని అభిలషించారు. ట్రైలర్ లో సక్సెస్ కళ పుష్కలంగా కనిపిస్తోందని, ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు వస్తున్న "నేను - కీర్తన" ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. 
 
చిమటా ప్రొడక్షన్స్ పతాకంపై చిమటా రమేష్ బాబు ("సి.హెచ్.ఆర్")ను దర్శకుడిగా పరిచయం చేస్తూ... చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్) - రిషిత - మేఘన హీరోహీరోయిన్లుగా... చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ) సమర్పణలో చిమటా లక్ష్మికుమారి నిర్మించిన "నేను-కీర్తన" చిత్రాన్ని ఈనెల 30న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 
 
హీరో కమ్ డైరెక్టర్ రమేష్ బాబు ఈ సందర్భంగా "నేను - కీర్తన" చిత్ర రూపకల్పనలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. తన సోదరి జ్యోతిర్మయి, తన జీవిత భాగస్వామి లక్ష్మీ కుమారిల సపోర్ట్ లేకుంటే... "నేను - కీర్తన" ఇంత అద్భుతంగా వచ్చేది కాదని పేర్కొన్నారు. ఒక మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడానికి అవసరమైన ఎలిమెంట్స్ అన్నీ ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. తన సోదరుడు నటించిన సినిమా అని అనడం లేదని, "నేను-కీర్తన" పైసా వసూల్ ఎంటర్టైనర్ అని చిత్ర సమర్పకురాలు చిమటా జ్యోతిర్మయి పేర్కొన్నారు. నిర్మాత చిమటా లక్ష్మీ కుమారి మాట్లాడుతూ... "ఎన్నో వ్యయప్రయాసలతో మల్టీ జోనర్ ఫిల్మ్ గా రూపొందించిన "నేను - కీర్తన" కచ్చితంగా నిరుపమాన విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
తనదైన వ్యాఖ్యానంతో అనూష ఈ కార్యకమాన్ని రక్తి కట్టించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశంలో జమిలి ఎన్నికలు తథ్యం.. అమలుకు ప్రత్యేక కమిటీ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ముంబై నటినే కాదు.. ఆమె సోదరుడిని కూడా వేధించిన పీఎస్ఆర్ ఆంజనేయులు

బోను తాళం పగలగొట్టుకొని మరీ బయటకు వచ్చిన పులి!!

సాక్షి ప్రకటనల రూపంలో అడ్డుగోలుగా రూ.443 కోట్లు దోచిపెట్టారు..

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించబోం.. చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments