పదివేల మంది కాలేజీ విద్యార్థులతో 'మేజర్' ట్రైలర్ సెలెబ్రేషన్స్ (video)

Webdunia
సోమవారం, 16 మే 2022 (13:45 IST)
Major
అడవి శేష్ మేజర్ ట్రైలర్‌ సెన్సేషనల్ క్రియేట్ చేస్తోంది. పదివేల మంది కాలేజీ విద్యార్థులతో అడవిశేష్ ట్రైలర్ సెలెబ్రేట్ చేసుకున్నారు. గత వారంలో సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో నిర్మాత, నటులు అడివి శేష్, సయీ మంజ్రేకర్, దర్శకుడు శశికిరణ్ తిక్క తదితరులు పాల్గొన్నారు. 
 
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోగ్రఫీ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఉన్నికృష్ణన్ తన బాల్యం నుండి 26/11 ముంబై దాడుల వరకు స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్నిఈ ట్రైలర్ స్కేల్ చేస్తుంది. దేశం కోసం ఆయన చేసిన త్యాగం,  26/11 ట్రాజెడీలో వందమంది అతిథులకు కాపాడింది. ప్రస్తుతం మేజర్ ట్రైలర్ 35 మిలియన్ల వ్యూస్‌ను దాటింది. ఇక జూన్ 3వ తేదీన ఈ సినిమా తెరకెక్కుతోంది.  
 
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంలోని అంకితభావం, ధైర్యం, త్యాగం ప్రేమ, స్ఫూర్తిని వర్ణిస్తూ ఈ ట్రైలర్ విడుదలైంది. ఇక  సూపర్ స్టార్ మహేష్ బాబుకు చెందిన జిఎంబి ఎంటర్టైన్మెంట్, ఎ+ఎస్ మూవీస్ తో కలిసి సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నాయి.
 
అలాగే ఈ మేజర్ చిత్రానికి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించగా, అడివి శేష్, శోభిత ధూళిపాళ, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ ప్రధాన తారాగణంగా ,నటించిన ఈ చిత్రం హిందీ, తెలుగు మలయాళంలో 2022 జూన్ 3న విడుదల కానుంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూటీ మీద స్కూలు పిల్లలు, గుద్దేశారు, వీళ్లకి డ్రైవింగ్ లైసెన్స్ వుందా? (video)

కవితతో మంచి సంబంధాలున్నాయ్.. కేటీఆర్ మారిపోయాడు.. నవీన్ కుమార్ యాదవ్

జాగ్రత్తగా ఉండండి: సురక్షిత డిజిటల్ లావాదేవీల కోసం తెలివైన పద్ధతులు

Pawan Kalyan just asking, అడవి మధ్యలోకి వారసత్వ భూమి ఎలా వచ్చింది? (video)

అసూయపడే, అహంకారపూరిత నాయకులకు ప్రజలు అధికారం ఇవ్వరు: రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments