Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగార్జునకు ఏమైంది? తారక్‌తో గొడవలా?

Webdunia
బుధవారం, 29 ఏప్రియల్ 2020 (23:53 IST)
అక్కినేని నాగార్జున - నందమూరి తారక్ (జూనీయర్ ఎన్టీఆర్) వీళ్లిద్దరి మధ్య మంచి అనుబంధం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. నాగార్జునను బాబాయ్ అని ఎంతో ఆప్యాయంగా పిలుస్తుంటారు. అయితే.. తారక్‌ ది రియల్ మేన్ ఛాలెంజ్‌ను నాగార్జునకు విసిరారు. అయితే.. ఇప్పటివరకు ఈ ఛాలెంజ్ గురించి నాగార్జున స్పందించలేదు. 
 
పోనీ.. ట్విట్టర్లో యాక్టీవ్‌గా లేరా అంటే... ఇటీవల శివమణి సినిమాలోని డైలాగ్స్‌ను కరోనా వైరస్‌కి లింకుపెడుతూ ఎవరో పంపించిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసారు. 
 
అంతేకాకుండా.. ఈ టైమ్‌లో శివమణి సినిమా చేస్తే.. పూరి జగన్నాథ్ డైలాగ్స్‌ను ఇలా రాస్తాడు అంటూ నాగార్జున ట్వీట్ చేయడం విశేషం. దీనికి పూరి కూడా స్పందిస్తూ.. సార్ మిస్ యు అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసారు. 
 
మరి.. తారక్ ఛాలెంజ్‌ని నాగార్జున ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు..? ఎందుకు స్పందించలేదు..? అనేది ఆసక్తిగా మారింది. దీంతో నాగార్జునకు ఏమైంది..? తారక్‌తో గొడవలా..? లేక వేరే ఏదైనా ప్రాబ్లమా..? అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు. మరి.. నాగార్జున ఈ ఛాలెంజ్ గురించి స్పందిస్తారేమో చూడాలి.

సంబంధిత వార్తలు

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments