Webdunia - Bharat's app for daily news and videos

Install App

గేమ్ ఛేంజర్ కు ఎందుకు హైప్ రావడంలేదు - కారణం అదేనా ?

డీవీ
మంగళవారం, 20 ఆగస్టు 2024 (16:41 IST)
Melbourne-Ramcharan
ఆర్.ఆర్.ఆర్. సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ ఆ తర్వాత చేస్తున్న గేమ్ ఛేంజర్. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. అయితే ఈ సినిమాలో భారీ తారాగణం వున్నా ఎందుకనే సినిమా హైప్ తీసుకురాలేకపోయింది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించిన భారతీయుడు 2 సినిమా ప్లాప్ కూడా చరణ్ సినిమాపై పడుతుందనే టాక్ కూడా వుంది. 
 
మరోవైపు రాజమౌళి సినిమా ఆర్.ఆర్.ఆర్. చేశాక హీరోలకు వెంటనే సక్సెస్ కూడా రాదనే టాక్ కూడా నెలకొంది. మరి ఈ సినిమాకు అభిమానుల్లోనూ పెద్ద బజ్ కూడా లేదు. భారతీయుడు2 సినిమాను చరణ్ ఫ్యాన్స్ మొదటివారంలోనే చూశారు. తన హీరో సినిమా ఎలా వుంటుందో అని బేరీజు కూడా వేశారు. దానితో వారికి పూర్తి క్లారిటీ వచ్చింది. 

ఇక గేమ్ ఛేంజర్ విడుదలకుముందు చరణ్ వివిధ ఫిలిం ఫెస్టివల్స్ లో విదేశాలలో వున్నారు. ఇటీవలే మెల్బోర్న్ వెళ్లారు.. అక్కడ కూడా  గేమ్ చంగెర్ గురించి చర్చ వచ్చింది. బ్లాక్ బస్టర్ సినిమా అవుతుందని చరణ్ అన్నట్లు తెలిసింది.  నేడు ఆయన తిరిగి హైదరాబాద్ కూడా వచ్చారు. 
 
కనుక ముందుముందు ఈ సినిమా ప్రమోషన్స్ ను వినూత్నంగా చేయించాలనే ప్లాన్ లో వున్నారు. ఇప్పటికి రెండు పోస్టర్లు, ఒక మాస్ పాటను రిలీజ్ అయింది. ఆగస్ట్ నెలాఖరులోగా అప్డేట్ చేస్తామని సంగీత దర్శకుడు థమన్ ఇటీవలే తెలియజేశారు. ఈ తాజా  అప్డేట్ సెప్టెంబర్ రెండవ వారంలో మాత్రమే రానుందని తెలుస్తోంది. 
 
ఈ సినిమాలో కియారా అద్వానీ, ఎస్‌జే సూర్య, అంజలి శ్రీకాంత్, జయరామ్, నవీన్ చంద్ర, సునీల్, శుభలేక సుధాకర్, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ ఆగ్రహం : సస్పెండ్ దిశగా ఆలోచనలు

సుంకాలను సున్నా శాతానికి తగ్గించేందుకు భారత్ ఆఫర్ చేసింది : డోనాల్డ్ ట్రంప్

India: వైజాగ్‌లో దేశంలోనే అతిపెద్ద గాజు వంతెన.. స్కైవాక్ టైటానిక్ వ్యూ పాయింట్‌

Pawan Kalyan పవన్ కళ్యాణ్ పుట్టినరోజు.. శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, అల్లు అర్జున్

పవన్ కళ్యాణ్... ఓ పీపుల్స్ స్టార్ : నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments