Webdunia - Bharat's app for daily news and videos

Install App

శింబు, త్రిషల పెళ్లిపై ప్రకటన... ముహూర్తం ఎప్పుడు?

Webdunia
బుధవారం, 21 అక్టోబరు 2020 (11:31 IST)
Trisha
శింబు, త్రిషల పెళ్లంటూ జోరుగా వార్తలు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో త్రిష యంగ్ ప్రొడ్యూసర్ వరుణ్ మణియన్‌ని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. కానీ ఆ పెళ్లి నిశ్చితార్థంతో ఆగిపోయింది. త్రిష పెళ్లి ఆగిపోవడానికి కారణం పెళ్లి తరువాత కూడా ఆమె సినిమాల్లో నటిస్తానని గట్టిగా చెప్పడమేనని, అది వరుణ్ మణియన్‌కి నచ్చకపోవడం వల్లే త్రిష అతనితో వివాహాన్ని రద్దు చేసుకుందని తమిళనాట వార్తలు వినిపించాయి.
 
అయితే తాజాగా ఆ వార్తల్లో నిజం లేదని, త్రిష - వరుణ్ మణియన్‌ల వివాహం ఆగిపోవడానికి ప్రధాన కారణం హీరో శింబు అని ప్రచారం మొదలైంది. దీనిపై శింబు తండ్రి రాజేందర్ మాట్లాడేందుకు నిరాకరించారు. తాజాగా అంటే ఈ నెల 22న శింబు సోషల్ మీడియాలోకి ఎంటర్ కాబోతున్నారట. ఇంత వరకు ఆయనకు ట్విట్టర్‌లో అకౌంట్‌లేదు. ఈ నెల 22న ఎంటరవుతున్నారట. 
 
ఇదే రోజు తన పెళ్లి వార్తని కూడా శింబు అనౌన్స్ చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా త్రిష, శింబు ప్రేమాయణంలో వున్నారని కోలీవుడ్ వర్గాల్లో టాక్ వస్తోంది. మరి ఈ వార్తలకు శింబు చెక్ పెడతారా? ఎలాంటి ప్రకటన చేస్తారనే దానిపై ప్రస్తుతం చర్చ సాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇజ్రాయెల్‌ నిబద్ధతపై అనుమానాలు : ఇరాన్

ఏపీలో మూడు రోజుల విస్తారంగా వర్షాలు

సింగయ్య మృతి కేసు : ఆ కారు జగన్మోహన్ రెడ్డిదే..

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం

మాజీ సీఎం జగన్‌కు షాకివ్వనున్న జొన్నలగడ్డ పద్మావతి దంపతులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments