Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోల్డ్ క్యారెక్టర్‌లో సత్తా చూపిస్తానంటున్న రంగమ్మత్త

Webdunia
సోమవారం, 22 మార్చి 2021 (08:32 IST)
తెలుగు సినిమాల్లో వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటున్న బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ. ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ అంతకంతకి క్రేజ్ విపరీతంగా పెంచుకుంటోంది. క్షణం, రంగస్థలం, సోగ్గాడే చిన్ని నాయన సినిమాలలో మంచి పాత్రలు చేసి పాపులారిటి తెచ్చుకుంది. 
 
ఆ తర్వాత పలు వరుస చిత్రాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంది. బోల్డ్ క్యారెక్టర్ అయినా తన సత్తా చూపించేసి ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం రంగ 'మార్తాండ', రవితేజ 'ఖిలాడి" సినిమాలున్నాయి. ఇలా మంచి క్యారెక్టర్స్‌లో సందడి చేస్తూనే స్పెషల్ నంబర్స్‌ చేస్తోంది. 
 
రీసెంట్‌గా 'చావుకబురు చల్లగా' సినిమాలో స్పెషల్ నంబర్‌లో కనిపించిన అనసూయ శర్వానంద్, సిద్దార్థ్ నటిస్తున్న 'మహాసముద్రం'లో కూడా ఒక స్పెషల్ నంబర్‌లో కనిపించబోతోందట. మొత్తానికి ఒకవైపు బుల్లితెర మీద మరొక వైపు బిగ్ స్క్రీన్ మీద గ్లామర్ ట్రీట్ ఇస్తూ చాలా బిజీగా ఉంటోంది.
 
అయితే, ఆమెకు సినిమాల్లో వరుస ఆఫర్లు రావడం వెనుక కారణాలను విశ్లేషిస్తే.. బుల్లితెర మీద అద్భుతంగా సందడి చేస్తోంది. తద్వారా భారీ క్రేజ్ తెచ్చుకుంది. ఈ విపరీతమైన క్రేజ్‌తోనే వరుస చిత్రాల్లో ఆఫర్లు కొట్టేస్తుందన్న టాక్ ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రైలులో ఎమ్మెల్యేకు సీటు ఇవ్వలేదని ప్రయాణికుడిని చితక్కొట్టారు... (Video)

బాలికతో స్నేహం.. బెదిరించి న్యూడ్ వీడియోలు తీసి ఫ్రెండ్స్‌కు షేరింగ్...

భర్తను కాదని మేనల్లుడిని పెళ్లి చేసుకుంది.. కూతురు అతనితోనే వుంటుంది.. (video)

NEET ప్రాక్టీస్ టెస్టులో తక్కువ మార్కులొచ్చాయని కుమార్తెను చంపేసిన తండ్రి

Pawan Kalyan: మధురైలో మురుగ భక్తర్గల్ మానాడులో పవన్ కల్యాణ్- ఫోటోలు, వీడియోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments