స్నేహితుల వద్ద బోరున ఏడుస్తున్న "ఘాజీ" దర్శకుడు.. ఎందుకో తెలుసా?
సంకల్ప్ రెడ్డి.. ఇపుడు టాలీవుడ్లో మార్మోగిపోతున్న పేరు. చేసిన తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు. దగ్గుబాటి రానా, ఢిల్లీ బ్యూటీ తాప్సీ జంటగా ఇండో-పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంతో "ఘాజీ" చ
సంకల్ప్ రెడ్డి.. ఇపుడు టాలీవుడ్లో మార్మోగిపోతున్న పేరు. చేసిన తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు. దగ్గుబాటి రానా, ఢిల్లీ బ్యూటీ తాప్సీ జంటగా ఇండో-పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంతో "ఘాజీ" చిత్రాన్ని తెరకెక్కించాడు. పూర్తిగా సబ్మెరైన్లో చిత్రీకరించిన ఈ చిత్రం అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుని కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మంచి విజయంతో పాటు కలెక్షన్ల పరంగా 'ఘాజీ' దుమ్మురేపుతుంటే చిత్ర దర్శకుడు సంకల్ప్ రెడ్డి మాత్రం తీవ్రంగా హర్ట్ అయ్యారట. పైగా, తన స్నేహితుల వద్ద తన గోడు వెళ్లబోసుకుని ఏడుస్తున్నారట. ఇంతకి అతని బాధ ఏంటో తెలుసుకుందాం.
‘ఘాజీ’ సినిమా గురించి, అందులో నటించిన రానా గురించి అందరూ మాట్లాడుకుంటున్నారేకానీ, ఆ సినిమా తీసిన తన గురించి ఏ ఒక్కరూ మాట్లాడక పోవడంతో సంకల్ప్ తీవ్రంగా హర్ట్ అయ్యారట. దాదాపు రెండేళ్ళ పాటు గ్రౌండ్ వర్క్ చేసి సినిమాను అద్భుతంతగా తీస్తే తన పేరును ఎవరూ తలుచుకోకపోవడంతో అతగాడికి బాధతో పాటు కోపం కూడా వస్తోందట. డైరక్టర్ బాగా తీస్తేనే కదా సినిమా అవుట్పుట్ బాగుండేది. అలాంటప్పుడు తెర వెనుక సారథిని మరిచిపోయి తెరమీద కనిపించే హీరోను పొగడటం ఏ సబబు? సబబని ఆయన ప్రశ్నిస్తున్నారు.