Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుశాంత్ 'స్త్రీ'లోలుడా? - సారాతోనూ ప్రేమాయణం!? (Video)

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (12:22 IST)
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య తర్వాత ఆయన క్యారెక్టర్‌, విలాసాలు, జల్సాలకు సంబంధించిన అనేక విషయాలు రోజుకొకటి చొప్పున వెలుగులోకి వస్తున్నాయి. బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు హీరోయిన్లతో ఈ కుర్ర హీరో ప్రేమాయణం కొనసాగించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ బహుముఖ ప్రేమలే చివరకు ఆయన బలవన్మరణానికా కారణమయ్యాయనే విమర్శలు లేకపోలేదు. 
 
సుశాంత్ నడిపిన ప్రేమాయణాల్లో భాగంగా, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీకాన్ కుమార్తె, హీరోయిన్ సారా అలీఖాన్‌తో పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగితేలాడ‌నే విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ విషయాన్ని సుశాంత్ స్నేహితుడు శామ్యూల్ హోకిప్ బహిర్గతం చేశారు. పైగా, సుశాంత్ - సారా ప్రేమకు సంబంధించిన కీలక విషయాలను ఆయన వెల్లడించారు.
 
ముఖ్యంగా, "కేదార్‌నాథ్" చిత్రం కోసం సుశాంత్, సారా అలీఖాన్ కలిసి పనిచేశారు. ఈ సినిమా స‌మ‌యంలో ఇద్దరి మ‌ధ్య ప్రేమ చిగురించింది. కొద్ది రోజుల‌కే ఆ ప్రేమ మరింతగా బలపడింది. చిత్ర ప్ర‌మోష‌న్ స‌మ‌యానికి సుశాంత్ - సారా డీప్ ల‌వ్‌లో ఉన్నారు. ఈ మూవీ త‌ర్వాత సుశాంత్ న‌టించిన 'సోన్‌చిరియా' చిత్రం ఫ్లాప్ కావ‌డంతో సారా.. సుశాంత్‌కి దూర‌మైంది. పీకల్లోతు ప్రేమలో ఉన్న సారా.. ఈ చిత్రం ఫెయిలైన తర్వాత సుశాంత్‌కు బ్రేకప్ చెప్పడం తనను ఆశ్చర్యానికి లోనుచేసిందని శామ్యూల్ చెప్పుకొచ్చాడు.
 
వాస్తవానికి ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ చిన్న పిల్ల‌లలో ఉండే స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌లా క‌నిపించేంది. ఒక‌రిపై ఒక‌రికి చెప్ప‌లేనంత గౌర‌వం ఉండేది. ఒకరిపై మరొకరు కవితలు చెప్పుకొనే వారు. పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉండేవారని చెప్పుకొచ్చారు. అయితే, సుశాంత్‌తో రియా చక్రవర్తి పరిచయం తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని తెలిపారు. సుశాంత్ - సారాను రియానే విడిదీసిందని తాను బలంగా నమ్ముతానని శామ్యూల్ హోకిప్ చెప్పుకొచ్చారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Twin infants: డ్రైనేజీ కాలువలో కవల శిశువులు.. కాలువలో కొట్టుకుపోయారా? లేక పడేశారా?

Mega DSC: మెగా డీఎస్సీ-2025 పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదు.. ఏపీ సర్కారు

Raja Singh: ఇంటిదొంగలంతా ఒక్కటైయ్యారు- బీజేపీలో బీఆర్‌ఎస్ నిజమేనేమో: రాజా సింగ్

Jagan: వైకాపా నేతలపై కేసుల బెడద: లీగల్ టీమ్‌పై దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి

మహానాడులో మోస్ట్ మెచ్యూర్డ్‌గా నారా లోకేష్ స్పీచ్.. ఏడుసార్లు గుజరాత్‌లో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments