Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి 'ఆచార్య' చిత్రంలో విలన్‌గా రియల్ హీరో!!

Webdunia
గురువారం, 30 జులై 2020 (10:32 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "ఆచార్య". కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కరోనా వైరస్ కారణంగా వాయిదాపడింది. అయితే, ఈ చిత్రంలోని విలన్ పాత్రకు అనేక మంది పేర్లను చిత్ర యూనిట్ పరిశీలించింది. కానీ, చివరకు వెండితెరపై విలన్‌గా, నిజ జీవితంలో రియల్ హీరోగా మారిన బాలీవుడ్ నటుడు సోనూ సూద్‌ను తాజాగా సంప్రదించినట్టు సమాచారం. 
 
కరోనా కష్టకాలంలో సోనూ సూద్ అనేక మందికి కేవలం దేశంలోనే కాదు.. విదేశాల్లోని భారతీయులకు సైతం తన వంతు సాయం చేశాడు. ముఖ్యంగా, కరోనా కష్టాల్లో చిక్కుకున్న అనేక మంది వలస కూలీలను తమ స్వస్థలాలకు చేర్చాడు. అలాగే, మరికొందరికి మరో విధంగా ఆపన్నహస్తం అందించాడు. అలా వెండితెర విలన్ ఇప్పుడు నిజజీవితంలో 'హీరో' అయ్యాడు.
 
తాజాగా ఏపీలో ఓ పేద రైతు తన ఆడపిల్లలను కాడెద్దులుగా మార్చి దుక్కిదున్నుతున్న ఫొటోలను చూసి చలించిపోయి ఆగమేఘాలపై ఎనిమిది లక్షలతో వారికి ట్రాక్టర్ కొనివ్వడం.. ఇంటువంటి ఎన్నో సత్కార్యాలతో రియల్ హీరో అనిపించుకున్నాడు. ఈ ఆపత్కాలంలో ఇలాంటి సేవా కార్యక్రమాల కోసం సోనూ సూద్ సుమారు 10 కోట్ల రూపాయల మేరకు ఖర్చు చేసినట్టు సమాచారం.
 
ఇదిలావుంటే, చిరంజీవి నటిస్తున్న 'ఆచార్య'లో ప్రధాన విలన్ పాత్ర కోసం ఆయనను సంప్రదించినట్టు తెలుస్తోంది. ఆయన కూడా పాత్ర నచ్చడంతో ఈ చిత్రం చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కరోనా పరిస్థితులు కుదుటపడ్డాక మొదలవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pic Talk: నారా లోకేష్- పవన్ కల్యాణ్ సోదర బంధం.. అన్నా టికెట్ కొనేశాను..

Pawan Kalyan: పెట్టుబడులను ఆకర్షించడానికి బలమైన శాంతిభద్రతలు కీలకం: పవన్ కల్యాణ్

Independence Day: తెలంగాణ అంతటా దేశభక్తితో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Stree Shakti: మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు, పవన్, నారా లోకేష్ (video)

ఏపీ అసెంబ్లీ భవనంలో రూ.1.5 కోట్ల వ్యయంతో హై-స్పీడ్ ప్రింటింగ్ యంత్రాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

తర్వాతి కథనం
Show comments