బాల‌కృష్ణ‌తో శ్రుతి హాస‌న్ ఫిక్స్ అయిన‌ట్లే!

Webdunia
సోమవారం, 17 మే 2021 (18:49 IST)
Sruti (ig)
క‌రోనా మొద‌టి వేవ్ స‌మ‌యంలో విడుద‌లైన ర‌వితేజ `క్రాక్‌` మంచి విజ‌యాన్ని సాధించింది. అందులో శ్రుతిహాస‌న్ న‌టించింది. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆ సినిమా స‌క్సెస్ త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవితో భేటీ అయ్యారు గోపీచంద్‌. అయితే ఆ త‌ర్వాత బాల‌కృష్ణ‌ను కూడా క‌లిశారు. ఆయ‌న‌తో సినిమా చేయ‌డానికి చ‌ర్చ‌లు జ‌రిగిన‌ట్లు అప్ప‌ట్లోనే తెలియ‌జేశారు. ఇది ఇప్ప‌టి వ‌ర్క‌వుట్ అయింది. నంద‌మూరి బాలకృష్ణ‌తో గోపీచంద్ సినిమా చేయ‌బోతున్నాడు. ప్ర‌స్తుతం బాల‌య్య‌బాబు `అఖండ‌` సినిమాలో వున్నాడు. ఇంకా కొంత భాగం పూర్తి చేయాల్సి వుంది.
 
కాగా, తాజా స‌మాచారం ప్ర‌కారం బాల‌కృష్ణ‌తో జోడీ క‌ట్ట‌డానికి శ్రుతిహాస‌న్‌ను ప‌రిశీల‌న‌లో వున్న‌ట్లు చిత్ర యూనిట్ తెలియ‌జేస్తుంది మైత్రీమూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. సినిమాను లాంఛనంగా అరంభించారు కూడా. ‘డాన్ శీను, బలుపు, పండగ చేస్కో’ వంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్ బాలకృష్ణ ఇమేజ్ కు సరిపోయేలా ఓ చరిత్రకారుని కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించబోతున్నార‌ని తెలుస్తోంది.
 
పల్నాటి ప్రాంతానికి చెందిన ఆ చరిత్రకారుని కథకి బాలయ్య త‌గిన న్యాయం చేస్తాడ‌ని అంటున్నారు. ఈ సినిమాలో ఫ్లాష్‌బేక్ ఎపిసోడ్ కీల‌క‌మైంది. అందుకు శ్రుతిహాస‌న్ స‌రిపోతుంద‌ని అందుకే ఆమెను సంప్ర‌దించిన‌ట్లు తెలుస్తోంది. క‌రోనా క‌రుణిస్తే జులై నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలన్నది దర్శకనిర్మాతల ప్లాన్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్తాన్ కొత్త చట్టం: పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మారణహోమం చేసినా జీవితాంతం అరెస్ట్ చేయరట

అచ్యుతమ్ కేశవమ్, అలీనగర్‌లో ఆర్జేడీకి షాకిచ్చిన మైథిలీ ఠాకూర్, ఆమె ఎవరు?

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : కేంద్ర మాజీ మంత్రిపై బీజేపీ సస్పెండ్

న్యాయం చేయాలంటూ డిఐజిని కలిసేందుకు పరుగులు తీసిన అత్యాచార బాధితురాలు (video)

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఖాతా తెరిచిన బీఎస్పీ.. అదీ కూడా 30 ఓట్ల మెజార్టీతో..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments