Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ సినిమాకు నో చెప్పిన ఫిదా భామ?

Webdunia
బుధవారం, 12 మే 2021 (12:33 IST)
శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన 'ఫిదా' సినిమాతో తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఇటు తెలుగు, తమిళం, మళయాళంలో కూడా వరుస సినిమాల్లో నటిస్తూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో వచ్చిన ఆఫర్ ను సాయి పల్లవి సున్నితంగా తిరస్కరించిందని టాలీవుడ్ టాక్.
 
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఛత్రపతి హిందీ రీమేక్ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. వి వి వినాయక్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా పలువురు బాలీవుడ్ హీరోయిన్స్‌ను సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఎవరూ ఫైనల్ కాలేదని సమాచారం. 
 
ఈ క్రమంలో ఇటీవల ఫిదా బ్యూటీ సాయి పల్లవి ని సంప్రదించారట. అయితే ప్రస్తుతం ఈమె టాలీవుడ్‌లో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉండటంతో డేట్స్ సర్దుబాటు చేయలేనని చెప్పినట్టు తెలుస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ - వినాయక్‌లకు హిందీలో డెబ్యూ సినిమా కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమాలో నటించేందుకు సాయిపల్లకి రెండు కోట్ల రెమ్యునరేషన్ ఇస్తామని చెప్పినా ఆమె అంగీకరించలేదని టాక్ వస్తోంది. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments