Webdunia - Bharat's app for daily news and videos

Install App

''అజ్ఞాతవాసి'' నిర్మాతపై ప్రశంసలు.. డిస్ట్రిబ్యూటర్లను అలా ఆదుకున్నాడట..

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్‌ నటించిన చిత్రం అజ్ఞాతవాసి. సంక్రాంతికి ముందు విడులైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడింది. దీంతో అభిమానులు సైతం నిరాశలో కూరుకుపోయారు. అయితే భా

Webdunia
శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (17:15 IST)
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్‌ నటించిన చిత్రం అజ్ఞాతవాసి. సంక్రాంతికి ముందు విడులైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడింది. దీంతో అభిమానులు సైతం నిరాశలో కూరుకుపోయారు. అయితే భారీ మొత్తానికి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను కొనేశారు.

కానీ ఈ సినిమా విజయవంతం కాకపోవడంతో.. ప్రాంతాల వారీగా తీసుకున్నవారంతా నష్టాల్లో మునిగిపోయారు. ఫలితంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు రూ.14కోట్ల మేర నష్టపోయినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. 
 
ఈ సినిమా ద్వారా డిస్ట్రిబ్యూటర్లు నష్టపోకూడదనే ఉద్దేశంతో నిర్మాత రాధాకృష్ణ ప్రయత్నాలు చేపట్టారట. ఆ నష్టాల నుంచి వాళ్లను గట్టెక్కించేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. ఇందులో భాగంగానే దిల్ రాజుకు రాధాకృష్ణ రూ.7 కోట్ల వరకు చెల్లించారని టాక్ వస్తోంది. అలాగే మిగిలిన డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఫోన్ కాల్స్ వెళ్లాయని.. వారందరికీ రాధాకృష్ణ కొంత నష్టపరిహారం చెల్లించినట్లు సమాచారం.
 
మరికొంతమందికి తర్వాత ప్రాజెక్టుకు సంబంధించిన కమిట్‌మెంట్లు ఇస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో అజ్ఞాతవాసి నిర్మాత తీసుకున్న నిర్ణయం పట్ల డిస్ట్రిబ్యూటర్లు హర్షం వ్యక్తం చేయడంతో పాటు రాధాకృష్ణను అభినందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తల్లికి ఇద్దరు భర్తలు.. పలువురితో సన్నిహిత సంబంధం.. నచ్చకే ప్రియుడితో కలిసి హత్య

వైజాగ్‌లో కాగ్నిజెంట్ కార్యాలయం... థ్యాంక్స్ చెప్పిన మంత్రి నారా లోకేశ్

ప్రభుత్వ ఆస్పత్రిలో మహిళా రోగిపై లైంగిక దాడి.. మృతి.. ప్రారంభమైన దర్యాప్తు..

తల్లితో అక్రమ సంబంధం.. కుమార్తెను పెళ్లి చేసుకోవాలని భర్తను చంపించిన బ్యాంకు మేనేజర్

Monsoon: కేరళలో ఆ 3 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ.. మరో ఏడు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

తర్వాతి కథనం
Show comments