అది నేర్చుకోవడంలో నేను నిత్యవిద్యార్థినే అంటున్న రాశీ ఖన్నా

Webdunia
గురువారం, 28 మే 2020 (17:43 IST)
రాశీఖన్నా విద్యార్థి అవతారమెత్తడమేంటి.. సినిమాలో విద్యార్థిగా నటిస్తోంది.. ఇప్పుడు షూటింగ్‌లు లేవు కదా. రాశీ ఖన్నా ఉన్నట్లుండి విద్యార్థినిగా మారిపోవడం ఏంటని అందరూ అనుకుంటున్నారు కదా. అదేమీ లేదండి.. లాక్ డౌన్ సమయంలో ఖాళీగా ఉండడం ఇష్టం లేని రాశీ ఖన్నా తమిళం నేర్చుకుంటోందట.
 
తెలుగులో కాదు తమిళంలోను రాశీకి మంచి ఆఫర్లే వస్తున్నాయట. దీంతో రాశీ ఖన్నా తమిళం నేర్చుకోవాలని లాక్ డౌన్ ముందే అనుకున్నదట. షూటింగ్ చేస్తూనే తమిళం నేర్చుకోవడానికి గంట సమయం కేటాయించాలని నిర్ణయించుకుందట. అయితే ఉన్నట్లుండి లాక్ డౌన్ రావడం.. షూటింగ్‌లు ఆగిపోవడం జరిగిపోయాయి. 
 
ఇది కాస్త రాశీ ఖన్నాకు బాగా కలిసొచ్చింది. అందుకే రాశీ ఖన్నా తమిళంలో తన గురువు మిస్ లీలతో ఆన్ లైన్లో క్లాస్‌లు నేర్చుకుంటోందట. తాను విద్యార్థిని అయిపోయానంటూ ల్యాప్ టాప్ చేతిలో పట్టుకుని ఒక ఫోటోకు ఫోజిచ్చి ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది అమ్మడు. ఆ ఫోటోకు కాస్త అభిమానులు తెగ సందేశాలను పంపించేస్తున్నారట.
 
చిన్నప్పుడు ఎప్పుడో స్కూలుకు వెళ్ళి చదువుకున్నాను. మళ్ళీ ఇప్పుడు విద్యార్థినిగా మారిపోయి చదువుకుంటున్నాను. నేను నిత్యవిద్యార్థిని అంటూ పోస్ట్ చేసిందట రాశీ ఖన్నా. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ.2 కోట్లు విరాళమిచ్చిన జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్

పాలకులం కాదు.. సేవకులకు మాత్రమే : సీఎం రేవంత్ రెడ్డి

దారంతా గతుకులు.. భవిష్యత్ ఏంటన్న ప్రశ్న ఉండేది.. తెలంగాణలో జనసేన గెలుపుపా పవన్ కళ్యాణ్

ఇంటర్, డిగ్రీ విద్యార్థులు కలిసి మహిళకు సిజేరియన్ ఆపరేషన్ చేశారు... తర్వాత...

మున్సిపాలిటీ వార్డు మెంబరుగా గెలిచిన మహిళా గొర్రెల కాపరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

మొలలు లేదా పైల్స్ వున్నవారు తినకూడని పదార్థాలు ఏంటి?

Pink salt : పింక్ సాల్ట్ ఆరోగ్య ప్రయోజనాలు.. ఇందులో అయోడిన్ ఉండదు

అల్లంతో కండరాల నొప్పి, బహిష్టు నొప్పి తగ్గుతుంది

వేసవిలో చల్లచల్లగా కర్బూజ రసం తాగితే ఇవే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments