Webdunia - Bharat's app for daily news and videos

Install App

జక్కన్న నెక్ట్స్ మూవీ మహేష్ బాబుతోనా? ప్రభాస్‌తోనా?

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2020 (15:32 IST)
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా తర్వాత రాజమౌళి ఎవరితో అనేది ఆసక్తిగా మారింది. అటు అభిమానుల్లోను ఇటు ఇండస్ట్రీలోను జక్కన్న నెక్ట్స్ ఎవరితో సినిమా చేయనున్నాడు అనే చర్చ జరుగుతుంది. అయితే... ఎప్పటి నుంచో మహేష్ బాబు - రాజమౌళి  కాంబినేషన్లో మూవీ గురించి వార్తలు వచ్చాయి కానీ.. ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్ సెట్ కాలేదు. 
 
మహేష్‌ బాబుతో సినిమా చేస్తే ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుందని రాజమౌళి గతంలో నెటిజన్లను అడగడం జరిగింది. చాలా మంది అల్లూరి సీతారామరాజు సినిమాని మహేష్‌ బాబుతో చేయమన్నారు. అయితే.. మహేష్ బాబు కానీ.. రాజమౌళి కానీ అల్లూరి సీతారామరాజు సినిమాని మహేష్‌‌తో చేయడానికి ఇంట్రస్ట్ చూపించడం లేదు. కారణం ఏంటంటే... మహేష్ అల్లూరి సీతారామరాజు సినిమా చేస్తే... తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో పోలుస్తారు. 
 
కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమా అనేది క్లాసిక్. ఆ క్లాసిక్ ని టచ్ చేయకూడదు అనేది మహేష్ ఆలోచన. దీనికి రాజమౌళి కూడా ఓకే చెప్పడంతో వీరిద్దరూ కలిసి అల్లూరి సీతారామరాజు కాకుండా మరో సినిమా చేయాలనుకున్నారు. మహేష్‌ బాబుతో.. మోసగాళ్లకు మోసగాళ్లు తరహా యాక్షన్ మూవీ చేస్తానని రాజమౌళి గతంలో చెప్పారు.
అయితే.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా ప్లాన్ చేస్తున్నారని.. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ మూవీగా రూపొందనుందని తెలిసింది. దీని కోసం స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ ఆల్రెడీ స్టోరీ రెడీ చేయడం జరిగింది అంటూ వార్తలు వస్తున్నాయి. మరోవైపు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో మళ్లీ సినిమా చేసేందుకు రెడీ అని రాజమౌళి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలియచేసారు. 
 
ఎప్పుడు స్టోరీ సెట్ అయితే.. అప్పుడు ప్రభాస్‌తో సినిమా ఉంటుందని జక్కన్న తెలియచేసాడు. దీంతో ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి మహేష్‌ బాబుతో సినిమా చేస్తాడా..? లేక ప్రభాస్‌తో చేస్తాడా..? అనేది ఆసక్తిగా మారింది. మరి.. జక్కన్న నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments