Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరి డైరెక్షన్లో నాగ్ మూవీ నిజమేనా..?

Webdunia
మంగళవారం, 18 ఆగస్టు 2020 (14:15 IST)
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం ఫైటర్ మూవీ చేస్తున్నారు. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ - బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే జంటగా నటిస్తున్న ఈ మూవీని పూరి- ఛార్మి- కరణ్‌ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కరోనా కాస్త తగ్గిన తర్వాత హైదరాబాద్‌లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీని దసరాకి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కరోనా కారణంగా వచ్చే సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
ఇదిలా ఉంటే... లాక్ డౌన్ టైమ్‌లో పూరి వరుసగా కథలు రాస్తున్నారు. చిరంజీవి కోసం పూరి కథ రాసారని వార్త వచ్చింది. ఆ తర్వాత బాలయ్య కోసం కూడా పూరి కథ రాసారని మరో వార్త వచ్చింది. అలాగే వెంకీ 75వ చిత్రం కోసం పూరిని కాంటాక్ట్ చేసారని కూడా ఓ వార్త వచ్చింది.
 
తాజా వార్త ఏంటంటే... టాలీవుడ్ కింగ్ నాగార్జున కోసం కూడా పూరి ఓ స్టోరీ రెడీ చేసారట. ఇప్పటివరకు నాగ్ - పూరి కలిసి శివమణి, సూపర్ సినిమాలు చేసారు. ఇప్పుడు మూడవ సినిమా చేయనున్నారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఎప్పటి నుంచో నాగ్‌తో పూరి సినిమా చేయాలనుకుంటున్నారు కానీ.. కుదరలేదు. ఈసారి సెట్ అయ్యిందని బలంగా వినిపిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

No pay no work: జీతం లేనిదే పని చేసేది లేదు.. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల నిరసన

Adilabad: ఆదిలాబాద్ గ్రామీణ పౌర సంస్థలకు ఎన్నికలు.. ఎప్పుడంటే?

Floods: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 50 ఏళ్ల తర్వాత తెలంగాణలో భారీ వర్షాలు- భారీ నష్టం

Kavitha: బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్.. పండగ చేసుకుంటోన్న పవన్ ఫ్యాన్స్

పవన్ కళ్యాణ్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన విజయసాయి రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments