Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరి డైరెక్షన్లో నాగ్ మూవీ నిజమేనా..?

Webdunia
మంగళవారం, 18 ఆగస్టు 2020 (14:15 IST)
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం ఫైటర్ మూవీ చేస్తున్నారు. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ - బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే జంటగా నటిస్తున్న ఈ మూవీని పూరి- ఛార్మి- కరణ్‌ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కరోనా కాస్త తగ్గిన తర్వాత హైదరాబాద్‌లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీని దసరాకి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కరోనా కారణంగా వచ్చే సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
ఇదిలా ఉంటే... లాక్ డౌన్ టైమ్‌లో పూరి వరుసగా కథలు రాస్తున్నారు. చిరంజీవి కోసం పూరి కథ రాసారని వార్త వచ్చింది. ఆ తర్వాత బాలయ్య కోసం కూడా పూరి కథ రాసారని మరో వార్త వచ్చింది. అలాగే వెంకీ 75వ చిత్రం కోసం పూరిని కాంటాక్ట్ చేసారని కూడా ఓ వార్త వచ్చింది.
 
తాజా వార్త ఏంటంటే... టాలీవుడ్ కింగ్ నాగార్జున కోసం కూడా పూరి ఓ స్టోరీ రెడీ చేసారట. ఇప్పటివరకు నాగ్ - పూరి కలిసి శివమణి, సూపర్ సినిమాలు చేసారు. ఇప్పుడు మూడవ సినిమా చేయనున్నారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఎప్పటి నుంచో నాగ్‌తో పూరి సినిమా చేయాలనుకుంటున్నారు కానీ.. కుదరలేదు. ఈసారి సెట్ అయ్యిందని బలంగా వినిపిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనవరి నుంచి బైకులన్నింటికీ 'ఏబీఎస్' తప్పనిసరి : కేంద్రం నిర్ణయం

సినిమా డైలాగులు థియేటర్లకే బాగుంటాయి : పవన్ కళ్యాణ్

ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం: మైక్రోసాఫ్ట్ ఆఫీసు గేటు వద్ద ఇరాన్ క్షిపణి పేలుడు (video)

విశాఖపట్టణంలో మరో దిగ్గజ ఐటీ క్యాంపస్ .. 8 వేల మందికి ఉద్యోగాలు

మద్యం మత్తులో రెచ్చిపోయిన పోకిరీలు ... బస్సును వెంబడిస్తూ అసభ్యకర చేష్టలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments