Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోగా అరంగేట్రం చేయనున్న వైఎస్ షర్మిల కుమారుడు.. డైరక్టర్ ఎవరో తెలుసా?

Webdunia
మంగళవారం, 11 జులై 2023 (10:12 IST)
YS Sharmila
సినిమాల్లో నటించాలని చాలామంది అనుకుంటారు. కలలు కంటారు. అయితే ఆ అదృష్టం కొందరికే వస్తుంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో దర్శకులు, నిర్మాతలు, హీరోలుగా పేరు తెచ్చుకున్న వారు తమ పిల్లలను హీరోలుగా ఎంట్రీ ఇచ్చేలా చేస్తున్నారు. 
 
ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్న వారు తమ పిల్లలను హీరోలుగా లాంచ్ చేస్తున్నారు. తామే పెట్టుబడి పెట్టి తమ వారసులను హీరోలుగా చేస్తున్నారు. చాలామంది రాజకీయ నాయకుల పిల్లలు ఇప్పటికే సినిమాల్లోకి వచ్చారు. తాజాగా టీఎస్‌వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ షర్మిల తనయుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. 
 
వైఎస్సార్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్‌ షర్మిల కుమారుడు వైఎస్‌ రాజా రెడ్డిని హీరోగా ఆవిష్కరించాలని కుటుంబసభ్యులు భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని వినికిడి. 
 
ఈ కొత్త కుర్రాడిని హీరోగా లాంచ్ చేయబోతున్న దర్శకుడు మరెవరో కాదు పూరీ జగన్నాధ్ అనే వార్తలు కూడా వస్తున్నాయి. పూరి జగన్నాథ్ కథను అందించాడని, ఆ కథ పూర్తి యాక్షన్ ఓరియెంటెడ్ ఫ్యామిలీ డ్రామా అని, అయితే దీనికి సంబంధించి అధికారిక సమాచారం లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీఎండబ్ల్యూ కారు కొనివ్వలేదనీ యువకుడు బలవన్మరణం...

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments