Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాంగ్రెస్‌లో వైఎస్. షర్మిల చేరిక.. కేవీపీ ఏమన్నారంటే..?

ys sharmila
, సోమవారం, 3 జులై 2023 (09:42 IST)
వైఎస్ షర్మిల రాజకీయ భవిష్యత్తుపై ఇటీవలి ఊహాగానాలపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల కాంగ్రెస్‌లో చేరే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 
 
ఈ ఊహాగానాలు గత కొన్ని రోజులుగా తీవ్రరూపం దాల్చడంతో రాజకీయ, మీడియా పరిశీలకుల్లో ఆసక్తి నెలకొంది. ఖమ్మంలో సమావేశం, అనంతరం గన్నవరం విమానాశ్రయానికి వెళ్లి రాహుల్ గాంధీని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన కేవీపీ.. కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల చేరిక ఖాయమనేట్లు వ్యాఖ్యానించారు. 
 
కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలన్న షర్మిల ఉద్దేశం తనకు తెలుసని కేవీపీ పేర్కొన్నారు. రాజకీయ శక్తుల ఏకీకరణకు సంకేతంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెను తమ పార్టీలోకి స్వాగతించడానికి పార్టీ సిద్ధంగా ఉందని కూడా ఆయన వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
 
గత ఎన్నికల సమయంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ)తో కలిసి మహాకూటమి ఏర్పాటు చేయాలని ఆ పార్టీ నిర్ణయించిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓటమికి ఈ నిర్ణయమే ప్రధాన కారణమని ఆయన అన్నారు.
 
ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కూడా మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు, జగన్ మోహన్ రెడ్డిల నిర్లక్ష్యాన్ని ఉటంకిస్తూ రాష్ట్రానికి కోలుకోలేని నష్టం వాటిల్లిందని ఫైర్ అయ్యారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

త్వరలోనే మహారాష్ట్రకు కొత్త ముఖ్యమంత్రి : సంజయ్ రౌత్