ప్ర‌భాస్‌, అనుష్క క‌లుస్తున్నారా!

Webdunia
శనివారం, 20 ఫిబ్రవరి 2021 (16:13 IST)
Prabhas, Anushka
ప్ర‌భాస్‌, అనుష్క అంటే ఇద్ద‌రి కాంబినేష‌న్ క్రేజీగా వుంటుంది. వీరి గురించి టాలీవుడ్‌లో మంచి బ‌జ్ కూడా క్రియేట్ అవుతుంది. ప్ర‌భాస్ వ‌రుస‌గా సినిమాలు చేస్తుంటే అనుష్క మాత్రం విరామం తీసుకున్న‌ట్లు క‌నిపిస్తుంది. ఎక్క‌డా ఆమె గురించి వార్త‌లు కానీ ఫొటోలు కానీ బ‌య‌ట‌కు రావ‌డంలేదు. కానీ విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం అనుష్క మ‌ర‌లా భారీ బేన‌ర్‌లో న‌టించ‌నుంది.

ఇదివ‌ర‌కు ఫొటో సెషన్ కూడా జ‌రిగిందని తెలుస్తోంది. ప్ర‌భాస్‌, అనుష్క మిర్చి కాంబినేష‌న్ అంద‌రికీ తెలిసిందే. సూప‌ర్ డూప‌ర్ హిట్‌. అంత‌టి హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌. నిర్మాణం మాతృ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్‌. ప్ర‌స్తుతం మైత్రీ మూవీ మేక‌ర్స్ వ‌రుస‌గా ఆరు సినిమాలు లైన్‌లో వున్నాయి. అందులో ప్ర‌భాస్ సినిమా ఒక‌టి. దానికి ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌నే. ఈసారి త‌ప్ప‌కుండా పాన్ ఇండియా మూవీగా తీయాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు మ‌రింత క్రేజ్ రావాలంటే హీరోయిన్ ఎవ‌ర‌నేది చ‌ర్చ జ‌రిగింది.

గ‌త కొద్దిరోజులు ప‌లువురు హీరోయిన్ల‌ను ప‌రిశీలించినా ఫైన‌ల్‌గా అనుష్క ద‌గ్గ‌ర‌కే చిత్ర యూనిట్ ఆగిపోతుంది. అందుకే మ‌రోసారి అనుష్క‌తో ప్ర‌భాస్ జోడీ క‌నువిందు వుంటుంద‌ని స‌న్నిహితులు చెబుతున్నారు. ఇక వీరిద్ద‌రు బాహుబ‌లి గురించి చెప్పాల్సిన ప‌నేలేదు. పైగా మ‌రోసారి వీరి కాంబినేష‌న్‌కు ఓ కార‌ణ‌ముంది.

అదేమంటే ప్ర‌భాస్‌కు 25వ సినిమాగా మైత్రీమూవీస్ బేన‌ర్‌లో రావ‌డం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం అందుకే అనుష్క పేరు బ‌య‌ట‌కు వ‌చ్చింది. అయితే ఈ విష‌యం అధికారికంగా తెలియాల్సివుంది. ఇప్పటికే ప్ర‌భాస్ రాధేశ్యామ్ సినిమా పూర్తీ కావొచ్చింది. దాంతో పాటు కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో సలార్ కూడా ఓ షెడ్యూల్ పూర్తీ చేసింది. అలాగే ఆది పురుష్ కూడా సెట్స్ పైనే ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments