Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీ ఎన్నికల తర్వాతే కొత్త సినిమాలు.. చేతిలో వున్నవి చేస్తే చాలు..?

Webdunia
మంగళవారం, 29 ఆగస్టు 2023 (10:39 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం సినీ ప్రాజెక్టులను పక్కనబెడుతున్నట్లు తెలుస్తోంది. రాజకీయ నాయకుడిగా మారిన పవన్ కల్యాణ్.. అసెంబ్లీ ఎన్నికల తర్వాతే కొత్త సినిమా ఆఫర్లను ఓకే చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే తాజా ప్రాజెక్టులకు కట్టుబడి వుండాలని మాత్రమే పవన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 
 
జనసేన పార్టీ స్థాపకుడిగా, అతను రాజకీయాల్లో చురుకుగా నిమగ్నమై వుండేందుకు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రజల సమస్యలపై పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ తన "వారాహి" యాత్రతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా పర్యటించారు. 
 
పవన్ కళ్యాణ్ నిర్ణయం రాబోయే అసెంబ్లీ ఎన్నికల తీవ్రతను కూడా ప్రతిబింబిస్తుంది. పవన్ కళ్యాణ్ తన సినీ కార్యకలాపాలను తాత్కాలికంగా పక్కన పెట్టడం ద్వారా, రాజకీయ రంగంపై పూర్తి దృష్టి పెడతానని ప్రత్యర్థులకు అద్భుతమైన సందేశం పంపారనే చెప్పాలి. ప్రస్తుతం, పవన్ కళ్యాణ్ సుజీత్  ఓజీ, హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలను ముగించాలని నిశ్చయించుకున్నారని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తల్లిదండ్రులకు ఇష్టంలేని పెళ్లి చేసుకుంటే భద్రత కల్పించాలా? అలహాబాద్ హైకోర్టు

ఈజీ మనీ పేరుతో అమ్మాయిల ట్రాప్.. ఆపై నగ్న వీడియోలు చిత్రీకరణ.. లైవ్ స్ట్రీమింగ్

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments