Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి హీరో అయితే ఏంటి.. ఆ ఆఫర్ నాకొద్దు.. నయనతార?

Webdunia
బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (16:14 IST)
సాధారణంగా మెగా ఫ్యామిలీకి చెందిన హీరోల సరసన అవకాశం కోసం హీరోయిన్లు వేయి కళ్ళతో ఎదురు చూస్తుంటారు. అదీకూడా మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంటి హీరోల సరసన నటించే ఛాన్స్ వస్తే మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోరు. కానీ, మలయాళ బ్యూటీ నయనతార మాత్రం మెగా ఆఫర్‌ను తిరస్కరించింది. 
 
మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ చిత్రాన్ని చిరంజీవి హీరోగా తెలుగులోకి రీమేక్ కానుంది. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్వీఆర్ సినిమా బ్యానర్స్‌పై ఆర్‌బీ చౌదరి.. ఎన్‌వీప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్‌ స్వరాలు సమకూరుస్తున్నాడు. 
 
ఇది చిరంజీవి కెరీర్‌లో153వ చిత్రం. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలోనే పట్టాలెక్కనుంది. ఈ క్రమంలో మిగతా పాత్రల్లో ఎవరెవరు నటిస్తారనే విషయాలపై టాలీవుడ్‌లో అనేక ఊహాగానాలున్నాయి. మొదట ఈ చిత్రంలో లేడి సూపర్‌ స్టార్‌ నయన తారను తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఇప్పటికే ‘సైరా నరసింహారెడ్డి’తో జతకట్టింది. దీంతో ఈ జోడి మరోసారి అందరినీ అలరిస్తారని అనుకున్నారు. 
 
అయితే నయనతార ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్లు టాక్‌ వినిపిస్తోంది. అయితే దీనికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. వాస్తవానికి ఒరిజినల్‌ వర్షన్‌లో హీరోయిన్‌ పాత్ర లేదు. కానీ, మెగాస్టార్‌ చిరంజీవి ఇమేజ్‌ను, ఆయన అభిమానులను దృష్టిలో పెట్టుకొని తెలుగు వర్షన్‌లో హీరోయిన్‌ పాత్రను దర్శకుడు చేర్చినట్లు సమాచారం. ఈ పాత్రను నయన్‌ రిజెక్ట్‌ చేయడంతో చిత్ర యూనిట్‌ మరో హీరోయిన్‌ వేటలోపడినట్టు హైదరాబాద్ ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఈవో పోస్టుకు ఎసరు పెట్టిన ఉద్యోగితో ప్రేమ!!

Hyderabad: భూ వివాదం ఒక ప్రాణాన్ని బలిగొంది.. నలుగురు కుమారుల మధ్య..?

భర్త తప్పిపోయాడని క్షుద్ర వైద్యుడి దగ్గరికి వెళ్తే.. అసభ్యంగా ప్రవర్తించాడు.. ఏం చేశాడంటే?

కర్నూలులో వరుస హత్యలు.. భయాందోళనలో ప్రజలు

Heavy rainfall: బంగాళాఖాతంలో అల్పపీడనం- తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments