Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఆచార్య" విడుదలకు అడ్డుపడుతున్న కరోనా!

Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (19:10 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం "ఆచార్య". కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం రిలీజ్‌ వాయిదా పడుతుందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అవి ఇపుడు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. 
 
ఆ చిత్రం కోసం మెగా అభిమానులు కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ కూడా చివరి దశకు వచ్చింది. పైగా ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. దానికి తోడు మొన్న విడుదలైన 'లాహే లాహే' పాట యూ ట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది. 
 
గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను సాహితీ చాగంటి, హారిక నారాయణ్ పాడారు. ఈ పాటతో పాటు టీజర్‌కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా రూ.100 కోట్లకు పైగా జరుగుతుంది. కోవిడ్ తర్వాత తెలుగులో విడుదలవుతున్న భారీ సినిమాల్లో 'ఆచార్య' ముందు వరుసలో ఉంటుంది. 
 
మే 13న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు. కానీ ప్రస్తుతం పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో 'ఆచార్య' సినిమా రిలీజ్‌ వాయిదా వేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్పటికే శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'లవ్ స్టోరీ' కూడా వాయిదాపడిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: వైకాపా నేతలపై కేసుల బెడద: లీగల్ టీమ్‌పై దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి

మహానాడులో మోస్ట్ మెచ్యూర్డ్‌గా నారా లోకేష్ స్పీచ్.. ఏడుసార్లు గుజరాత్‌లో?

Vamsi: రాజకీయాల్లోకి వల్లభనేని వంశీ సతీమణి పంకజ శ్రీ: గన్నవరంలో ప్రకటన?

విజిలెన్స్ అధికారులు వస్తున్నారని రూ. 500 కరెన్సీ నోట్లను కిటికీ నుంచి విసిరేసిన అవినీతి తిమింగలం

Surya Grahan 2025: 2025లో రెండో సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments