Webdunia - Bharat's app for daily news and videos

Install App

థియేటర్లు మన చేతుల్లోనే.. మనకే కేటాయించుకుందాం : ఆ ముగ్గురు బడా నిర్మాతల సంక్రాంతి సెటిల్మెంట్!

టాలీవుడ్‌లో సంక్రాంతి పండుగకు థియేటర్ల కొరత ఏర్పడనుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్లన్నీ ఆ ముగ్గురు నిర్మాతల చేతుల్లోనే ఉండటంతో ఈ పరిస్థితి ఉత్పన్నంకానుంది. పైగా.. ఆ ముగ్గురు నిర్మాతలు బడా

Webdunia
సోమవారం, 9 జనవరి 2017 (10:03 IST)
టాలీవుడ్‌లో సంక్రాంతి పండుగకు థియేటర్ల కొరత ఏర్పడనుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్లన్నీ ఆ ముగ్గురు నిర్మాతల చేతుల్లోనే ఉండటంతో ఈ పరిస్థితి ఉత్పన్నంకానుంది. పైగా.. ఆ ముగ్గురు నిర్మాతలు బడా ప్రొడ్యూసర్లు కావడంతో చిన్న చిత్రాలకు థియేటర్లు కేటాయించడం లేదు. దీంతో ఆర్.నారాయణ మూర్తి చిత్రానికి ఒక్క థియేటర్ కూడా కేటాయించలేదు. ఈ విషయాన్ని ఆయన మీడియా ముందే బహిర్గతం చేశారు.
 
దీనికి కారణం ఈ సంక్రాంతికి ఇద్దరు అగ్రహీలో చిత్రాలు విడుదల కానున్నాయి. వాటిలో ఒకటి మెగాస్టార్ చిరంజీవి చిత్రం "ఖైదీ నంబర్ 150" కాగా, మరొకటి బాలకృష్ణ నటించిన "గౌతమిపుత్రశాతకర్ణి" చిత్రాలు. వీటితో పాటు.. శర్వానంద్ 'శతమానం భవతి', ఆర్ నారాయణ మూర్తి 'హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య' చిత్రాలు బాక్సాఫీస్ యుద్ధానికి సిద్ధమయ్యాయి.
 
అయితే, సినిమా వసూళ్లలో నైజాం ఏరియా అత్యంత కీలకం. నైజాంలో ఎక్కువ థియేటర్స్ దిల్ రాజు, సురేష్ బాబు, అల్లు అరవింద్ చేతిలో ఉన్నాయి. వీరిలో సురేష్ బాబు 'గౌతమిపుత్ర శాతకర్ణి' అండగా ఉన్నారు. ఇక అల్లు అరవింద్ 'ఖైదీ నెం.150'కి దండుగా ఉన్నారు. దిల్ రాజు తన సొంత చిత్రం 'శతమానం భవతి' సినిమాని వీలైనన్ని ఎక్కువ థియేటర్స్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
 
అయితే, ఈ బడా నిర్మాతలంతా కలసి ఓ సెటిల్మెంట్ చేసుకొన్నట్టు ఫిల్మ్ నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫస్ట్ వీక్ టాక్ బట్టీ గుడ్ టాక్ తెచ్చుకొన్న సినిమాకి థియేటర్స్ పెంచాలని.. టాక్ బట్టి ఏ సినిమాకి నష్టం కాకుండా థియేటర్స్ అడ్జెస్ట్ చేయాలని తీర్మాణించినట్టు తెలుస్తోంది. మొత్తానికి బడా నిర్మాతల సెటిల్మెంట్ అదిరిపోయింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad Realtor: అప్పులు చేసి అపార్ట్‌మెంట్ నిర్మాణం, ఫ్లాట్స్ అమ్ముడవక ఆత్మహత్య

గుజరాత్- మహిళ బట్టలు విప్పి, దాడి చేసి, మోటార్ సైకిల్ చక్రానికి కట్టి ఈడ్చుకెళ్లారు..

ఫిబ్రవరి 2న జనంలోకి జనసేన.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రచారం

రాత్రికి రాత్రే అంతా మారిపోదు.. 16,347 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్.. చంద్రబాబు

హైదరాబాద్‌లో రక్తదాన శిబిరాలను నిర్వహించిన కిస్నా డైమండ్ జ్యువెలరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments